AP Girl Dead in USA: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలి విద్యార్థిని మృతి
అమెరికాలో మరణిస్తున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన గుంటూరు జిల్లా తెనాలి విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.
Vijayawada, July 21: అమెరికాలో (America) మరణిస్తున్న తెలుగు రాష్ట్రాల (Telugu States) విద్యార్థుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన గుంటూరు జిల్లా తెనాలి విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. మృతురాలిని తెనాలికి చెందిన జెట్టి హారిక (25) గా గుర్తించారు. మృతురాలు గతేడాది ఆగస్టులో అమెరికా వెళ్లారు. శనివారం యూనివర్సిటీ నుంచి కారులో ఇంటికి వెళ్తుండగా లోగాన్ కౌంటీలోని ఒక్లహోమా హైవేపై వరుసగా మూడు కార్లు ఢీకొనటంతో హారిక అక్కడికక్కడే మరణించారు. కాగా, అమెరికాలో ఎంఎస్ చేసేందుకు వెళ్లిన తెనాలికే తాడిబోయిన రవితేజ(28) మూడు రోజుల క్రితం స్విమింగ్ పూల్ లో మునిగి మరణించారు.
నేటి నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు.. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement