AP Girl Dead in USA: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలి విద్యార్థిని మృతి

అమెరికాలో మరణిస్తున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన గుంటూరు జిల్లా తెనాలి విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.

Harika

Vijayawada, July 21: అమెరికాలో (America) మరణిస్తున్న తెలుగు రాష్ట్రాల (Telugu States) విద్యార్థుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన గుంటూరు జిల్లా తెనాలి విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. మృతురాలిని తెనాలికి చెందిన జెట్టి హారిక (25) గా గుర్తించారు. మృతురాలు గతేడాది ఆగస్టులో అమెరికా వెళ్లారు. శనివారం యూనివర్సిటీ నుంచి కారులో ఇంటికి వెళ్తుండగా లోగాన్‌ కౌంటీలోని ఒక్లహోమా హైవేపై వరుసగా మూడు కార్లు ఢీకొనటంతో హారిక అక్కడికక్కడే మరణించారు. కాగా, అమెరికాలో ఎంఎస్‌ చేసేందుకు వెళ్లిన తెనాలికే తాడిబోయిన రవితేజ(28) మూడు రోజుల క్రితం స్విమింగ్‌ పూల్‌ లో మునిగి మరణించారు.

నేటి నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు.. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement