SBI ATM Heist: ఏటీఎంలో చోరీ.. రూ.30 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు, రంగారెడ్డి జిల్లా ఎస్‌బీఐ ఏటీఎంలో దొంగతనం, 4 నిమిషాల్లోనే చోరీ, పరార్

ఏటీఎంలో చోరీ.. రూ.30 లక్షలు ఎత్తుకెళ్లారు దొంగలు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలోని SBI ఏటీఎంలో దొంగతనం జరిగింది

ATM Heist Thieves Steal ₹30 Lakh from SBI ATM in Ranga Reddy(X)

ఏటీఎంలో చోరీ.. రూ.30 లక్షలు ఎత్తుకెళ్లారు దొంగలు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలోని SBI ఏటీఎంలో దొంగతనం జరిగింది(SBI ATM Heist). షిఫ్ట్ కారులో వచ్చి ఏటీఎంను కొల్లగొట్టారు నలుగురు దొంగలు.

సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి, ఎమర్జెన్సీ సైరన్ సెన్సార్ వైర్లను కట్ చేశారు దొంగలు(Thieves Steal ₹30 Lakh from SBI ATM). కట్టర్, ఇనుపరాడ్ల సహాయంతో ఏటీఎంను బద్దలు కొట్టి రూ.30 లక్షలు చోరీ చేశారు. 4 నిమిషాల్లో చోరీ చేసి పరారైయ్యారు దొంగలు. దొంగల కోసం బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు పోలీసులు.

హైదరాబాద్ సరూర్‌నగర్‌లో 10 మంది ట్రాన్స్‌జెండర్లు అరెస్ట్.. అర్ధరాత్రి రోడ్ల పైకి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని స్థానికుల ఫిర్యాదు, పోలీస్ కేసు నమోదు

ఇక మరో వార్తను పరిశీలిస్తే హైదరాబాద్ సరూర్‌నగర్‌లో 10 మంది ట్రాన్స్‌జెండర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. సరూర్‌నగర్ P&T కాలనీలో నివాసం ఉంటూ రెడ్ లైట్ ఏరియాగా మార్చారు ట్రాన్స్‌జెండర్లు. అర్ధరాత్రి రోడ్ల పైకి వచ్చి స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో 10 మంది ట్రాన్స్‌జెండర్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు.

ATM Heist: Thieves Steal ₹30 Lakh from SBI ATM in Ranga Reddy

 

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement