Bandi Sanjay On BRS: కాంగ్రెస్లో బీఆర్ఎస్ వీలినమన్న కేంద్రమంత్రి బండి సంజయ్, కేసీఆర్కు కాంగ్రెస్ అధ్యక్ష పదవి, కవితకు రాజ్యసభ అని కామెంట్
కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. అతి త్వరలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం తథ్యం అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సంజయ్... కాంగ్రెస్లో బీఆర్ఎస్ వీలనం తర్వాత కేసీఆర్కు ఏఐసీసీ, కేటీఆర్కు పీసీసీ చీఫ్, కవితకు రాజ్యసభ సీటు ఖాయం అన్నారు. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని పదవులు పంచుకున్న పార్టీ కాంగ్రెస్ది అన్నారు. కవిత బెయిల్కు బీజేపీకి ఏం సంబంధం అని ప్రశ్నించారు.
Delhi, Aug 16: కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. అతి త్వరలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం తథ్యం అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సంజయ్... కాంగ్రెస్లో బీఆర్ఎస్ వీలనం తర్వాత కేసీఆర్కు ఏఐసీసీ, కేటీఆర్కు పీసీసీ చీఫ్, కవితకు రాజ్యసభ సీటు ఖాయం అన్నారు. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని పదవులు పంచుకున్న పార్టీ కాంగ్రెస్ది అన్నారు. కవిత బెయిల్కు బీజేపీకి ఏం సంబంధం అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. ఆప్ పార్టీని బీజేపీలో విలీనం చేసుకుంటేనే మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిందా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కవిత బెయిల్కు బీజేపీకి సంబంధం లేదని, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు సంజయ్. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పక్కా, కేసీఆర్ గవర్నర్ అవుతారన్న సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్కు ఏ పదవో తెలుసా?
Here's Tweet: