#PoliceFlagDay: అమరుడైన హోం గార్డు లింగయ్య త‌ల్లికి పాదాభివంద‌నం చేసిన రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌ర్ మ‌హేశ్ భ‌గ‌వ‌త్, వీడియోని ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసిన క‌మిష‌న‌రేట్

రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌ర్ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ ఓ హోం గార్డు త‌ల్లికి పాదాభివంద‌నం చేసిన దృశ్యాల‌కు సంబంధించ‌ని వీడియోను ఆ క‌మిష‌న‌రేట్ త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. పోలీసు అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా వారి కుటుంబాల‌ను మ‌హేశ్ భ‌గ‌వ‌త్ స‌త్క‌రించారు.

CP Mahesh Bhagat Salute to home Guard lingayya mother (Photo-Video Grab)

రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌ర్ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ ఓ హోం గార్డు త‌ల్లికి పాదాభివంద‌నం చేసిన దృశ్యాల‌కు సంబంధించ‌ని వీడియోను ఆ క‌మిష‌న‌రేట్ త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. పోలీసు అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా వారి కుటుంబాల‌ను మ‌హేశ్ భ‌గ‌వ‌త్ స‌త్క‌రించారు. అంబ‌ర్‌పేట్ కార్ హెడ్ క్వార్ట‌ర్స్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో హోంగార్డు లింగ‌య్య త‌ల్లి సార‌మ్మ పాల్గొంది. ఈ నేప‌థ్యంలో ఆమెకు మ‌హేశ్ భ‌గ‌వ‌త్ పాదాభివంద‌నం చేశారు. కాగా, 2015లో ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా ఆత్మ‌కూర్ ప‌రిధిలోని సిమీ ఉగ్ర‌వాదుల‌తో జ‌రిగిన ఎదురు కాల్పుల్లో ఇద్ద‌రు పోలీసులతో పాటు హోంగార్డు లింగ‌య్య అమ‌రుల‌య్యారు. వారంద‌రికీ పోలీసులు నివాళులు అర్పించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement