Electric AC Bus: నేటి నుంచే హైదరాబాద్ నుంచి విజయవాడకు ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు, ప్రతి 20 నిమిషాలకు ఒకటి చొప్పున బస్సు

రాష్ట్రంలో పర్యావరణహితమైన ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను ‘ఈ–గరుడ’ పేరుతో నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ప్రతి 20 నిమిషాలకు ఒకటి చొప్పున ఈ బస్సులను నడపనున్నా­రు.

Electric AC Bus (Photo-Twitter)

రాష్ట్రంలో పర్యావరణహితమైన ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను ‘ఈ–గరుడ’ పేరుతో నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ప్రతి 20 నిమిషాలకు ఒకటి చొప్పున ఈ బస్సులను నడపనున్నా­రు. మొదటి విడతగా 10 బస్సులను ప్రారంభించనున్నారు.మిగతా 40 బస్సులను ఈ ఏడాది చివరినాటికి దశలవారీగా ప్రవేశపెట్టనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌లో­ని మియాపూర్‌ క్రాస్‌రోడ్‌ సమీపంలోని పుష్పక్‌ బస్‌ పాయింట్‌ వద్ద మంగళవారం సాయంత్రం 5 గంటలకు జరిగే కార్యక్రమంలోరవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ జెండా ఊపి ఈ బస్సులను లాంఛనంగా ప్రారంభిస్తారు

News;

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement