Telangana: భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన, పలు దేవాలయాలను సందర్శించిన రాష్ట్రపతి, పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. పర్యటన ముగియడంతో ఆమె హైదరాబాద్‌కు బయల్దేరారు. ఉదయం భద్రాచలం సీతారాములవారిని దర్శించుకుని,ఆపై మధ్యాహ్నా సమయంలో ములుగు రామప్పను ఆమె సందర్శించారు.

President Droupadi Murmu (Photo-Twitter)

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. పర్యటన ముగియడంతో ఆమె హైదరాబాద్‌కు బయల్దేరారు. ఉదయం భద్రాచలం సీతారాములవారిని దర్శించుకుని,ఆపై మధ్యాహ్నా సమయంలో ములుగు రామప్పను ఆమె సందర్శించారు. ఆమె వెంట గవర్నర్‌ తమిళిసైతో పాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పలువురు తెలంగాణ మంత్రులు ఉన్నారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్పను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించారు .రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆమె పూజలు చేశారు. రామప్ప ఆలయ ఆవరణలో ‘ప్రసాద్’ స్కీమ్ కింద రూ. 62 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

Here's Kishan Reddy Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement