Telangana: వీడియో ఇదిగో, పెళ్లిలో మటన్ కోసం తలలు పగలగొట్టుకున్నారు, పెళ్లికొడుకు తరపు వారికి మటన్ తక్కువ వేశారని కర్రలు, రాళ్లతో దాడి
నిజామాబాద్ జిల్లా నవీపేట్లో జరిగిన ఓ వివాహ వేడుకలో పెళ్లికొడుకు తరపు వారికి మటన్ తక్కువ వేశారని కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. దీంతో ఫంక్షన్ హాల్ రణరంగాన్ని తలపించింది. రాళ్లతో, కర్రలతో దాడి చేసుకోవడంతో చాలామందికి తలలు పగిలి గాయాలయ్యాయి. ఈ ఘటనలో పలువురు గాయపడగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా నవీపేట్ లోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో బుధవారం జరిగిన పెళ్లి విందులో ఇరు వర్గాలకు చెందిన కొందరు పరస్పర దాడులకు పాల్పడడంతో 19 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వినయ్కుమార్ తెలిపారు.
భోజనం చేస్తున్న సమయంలో ఒక వర్గానికి చెందిన వారికి సరిగ్గా వడ్డించడం లేదని మరో వర్గానికి చెందిన వ్యక్తులతో ఘర్షణకు దిగారు. ఘర్షణ ముదిరి కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులకు ఫంక్షన్ హాల్కు చేరుకుని శాంతింపజేశారు. పలువురిపై కేసు నమోదు చేశారు.
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Advertisement
Advertisement
Advertisement