Farmer Dies After Tractor Overturns: వెంటాడుతున్న విషాదాలు, 10 రోజుల్లో ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు రైతులు మృతి, తాజాగా పొలం దున్నుతూ ట్రాక్టర్ బోల్తా పడి అన్నదాత మృతి

తెలంగాణలోని నాగరకర్నూల్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని వంగూరు మండలంలో వంగూరు గ్రామానికి చెందిన రైతు మీసాల లక్ష్మయ్య పొలం దున్నుతూ ట్రాక్టర్ బోల్తా పడి మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.

farmer died due to tractor overturned while plowing the field

తెలంగాణలోని నాగరకర్నూల్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని వంగూరు మండలంలో వంగూరు గ్రామానికి చెందిన రైతు మీసాల లక్ష్మయ్య పొలం దున్నుతూ ట్రాక్టర్ బోల్తా పడి మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.

రెండు రోజుల క్రితం ఏపీలో అనకాపల్లి జిల్లాలోని కె.కోటపాడు మండలంలోని కింతాడ గ్రామానికి చెందిన బండారు శివ (35) శనివారం పొలంలో వరి దమ్ము దున్నుతుండగా ప్రమాదవశాత్తూ ట్రాక్టర్‌ బోల్తా పడింది. దీంతో శివ ట్రాక్టర్‌ కింద పడి మృతి చెందాడు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కె.కోటపాడు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చోడవరం తరలించారు.  మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, అతివేగంగా వచ్చి ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన కారు, నలుగురికి తీవ్ర గాయాలు

10 రోజుల క్రితం తెలంగాణలో జరిగిన ఘటనలో మరో యువకుడు ఇలాగే మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ మండలంలోని నాగపూర్ గ్రామంలో పొలం పనులు నిర్వహిస్తున్న వేళ ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. బ్రహ్మ పృథ్విరాజ్ (సన్నీ) (21) యువకుడు ట్రాక్టర్ నడిపిస్తున్నాడు. అదే క్రమంలో ఒక్కసారిగా ట్రాక్టర్ బోల్తా పడటంతో తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. కాగా స్థానికులు మృతదేహాన్ని బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Here's Video

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement