Telangana Fire: అత్తాపూర్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం, కట్టెల గోడౌన్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు, వీడియో ఇదిగో..

రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్‌, సులేమాన్ నగర్ ఎంఎం పహాడీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కట్టెల గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు తోడు దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

Representative image (Photo Credit: Pixabay)

రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్‌, సులేమాన్ నగర్ ఎంఎం పహాడీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కట్టెల గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు తోడు దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.మంటలకు తోడు భారీగా పొగ వ్యాపించడంతో స్థానికులు శ్వాస తీసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అత్తాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.  కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం, ఫర్నీచర్ షాపులో ఎగిసిపడ్డ అగ్నికీలలు, మరో మూడు షాపులకు పాకిన మంటలు

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement