Telangana: ఆ 23 గ్రామాలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు, అవన్నీఐదో షెడ్యూల్‌ కిందకే వస్తాయని తెలిపిన ధర్మాసనం, ఫలించిన 75 ఏళ్ల ఆదివాసీల పోరాటం

ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న 23 గ్రామాలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ములుగు జిల్లా మండపేట మండలంలోని 23 గ్రామాలు రాజ్యంగంలోని ఐదో షెడ్యూల్‌ కిందకే వస్తాయని తెలిపింది.

High Court of Telangana | (Photo-ANI)

ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న 23 గ్రామాలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ములుగు జిల్లా మండపేట మండలంలోని 23 గ్రామాలు రాజ్యంగంలోని ఐదో షెడ్యూల్‌ కిందకే వస్తాయని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ బుధవారం తీర్పు ప్రకటించారు. 75 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఆదివాసీలకు అనుకూలంగా హైకోర్టు తీర్పు వెలువడింది.

ఆదివాసుల తరపున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. అయితే, ఆ 23 గ్రామాలు రాజ్యాంగ పరిధిలోని ఐదవ షెడ్యూల్ పరిధిలోకి రావనీ ఆదివాసీయేతర నేతలు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఆదివాసీలకు అనుకూలంగా తీర్పునిచ్చింది.

High Court of Telangana | (Photo-ANI)
Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement