Telangana: సార్ మా అమ్మానాన్న రోజూ కొడుతున్నారు, వారిని శిక్షించండి, పోలీస్ స్టేషన్ గడప తొక్కిన బాలుడు, భార్యాభర్తలకు కౌన్సెలింగ్‌ ఇచ్చిన ఎస్‌ఐ సంతోష్‌రెడ్డి

శంకరపల్లిలో ఓ బాలుడు తల్లిదండ్రులు కొడుతున్నారంటూ పోలీస్ స్టేషన్ గడప తొక్కాడు. స్టేషన్ కి వెళ్లి ‘సార్‌.. మా అమ్మానాన్న కొడుతున్నారు.. నిత్యం నరకం చూపిస్తున్నారు. వారిని శిక్షించండి’’అంటూ శంకర్‌పల్లి పోలీసులను ఆశ్రయించాడు.

Shankarapally SI

శంకరపల్లిలో ఓ బాలుడు తల్లిదండ్రులు కొడుతున్నారంటూ పోలీస్ స్టేషన్ గడప తొక్కాడు. స్టేషన్ కి వెళ్లి ‘సార్‌.. మా అమ్మానాన్న కొడుతున్నారు.. నిత్యం నరకం చూపిస్తున్నారు. వారిని శిక్షించండి’’అంటూ శంకర్‌పల్లి పోలీసులను ఆశ్రయించాడు. ఎస్‌ఐ సంతోష్‌రెడ్డి కథనం ప్రకారం.. నారాయణపేట జిల్లా మద్దూరుకు చెందిన మాల నర్సింహులు, లక్ష్మి దంపతులు శంకర్‌పల్లిలోని హనుమాన్‌ నగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. రోజు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. లక్ష్మీకి మొత్తం ఐదు మంది సంతానం. వారిలో ఒకడైన రామును ప్రతిరోజు కొట్టడంతో పోలీసులను ఆశ్రయించాడు. ఎస్‌ఐ సంతోష్‌రెడ్డి భార్యాభర్తలకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. బాలుడిని మరోసారి కొడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Shankarapally police

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement