Corona in TS: తెలంగాణలో కొత్తగా 106 మందికి కోవిడ్, జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 49 కేసులు, రాష్ట్రంలో ఇప్పటివరకు 6,72,052 పాజిటివ్ కేసులు నమోదు

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 22,650 కరోనా పరీక్షలు నిర్వహించగా, 106 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. వీటిలో అత్యధిక భాగం జీహెచ్ఎంసీ పరిధిలోనివే. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 49 కేసులు నమోదయ్యాయి.

Coronavirus Pandemic in India (photo-Ians)

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 22,650 కరోనా పరీక్షలు నిర్వహించగా, 106 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. వీటిలో అత్యధిక భాగం జీహెచ్ఎంసీ పరిధిలోనివే. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 49 కేసులు నమోదయ్యాయి. జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 179 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒక మరణం సంభవించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,72,052 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,64,212 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,879 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,961కి పెరిగింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement