Coronavirus in TS: తెలంగాణలో కొత్తగా 122 మందికి కోవిడ్, జీహెచ్ఎంసీ పరిధిలో 55 కరోనా కేసులు నమోదు

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 26,676 కరోనా పరీక్షలు నిర్వహించగా, 122 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 55 కరోనా కేసులు నమోదు కాగా, జిల్లాల్లో ఎక్కడా రెండంకెల్లో కొత్త కేసులు నమోదు కాలేదు.

Coronavirus-in-India ( photo-PTI)

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 26,676 కరోనా పరీక్షలు నిర్వహించగా, 122 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 55 కరోనా కేసులు నమోదు కాగా, జిల్లాల్లో ఎక్కడా రెండంకెల్లో కొత్త కేసులు నమోదు కాలేదు. ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మెదక్, ములుగు, నారాయణపేట, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్కకొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 176 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,68,955 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,61,093 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,924 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,938కి పెరిగింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement