Corona in TS: తెలంగాణలో కొత్తగా 137 మందికి కరోనా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 48 కొత్త కేసులు
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 31,054 కరోనా పరీక్షలు నిర్వహించగా, 137 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 48 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 16, కరీంనగర్ జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 10 కేసులు గుర్తించారు.
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 31,054 కరోనా పరీక్షలు నిర్వహించగా, 137 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 48 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 16, కరీంనగర్ జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 10 కేసులు గుర్తించారు. వికారాబాద్, నిర్మల్, ములుగు, మెదక్, కొమరంభీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల, జనగామ జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 173 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,74,318 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,66,682 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 3,657 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,979కి పెరిగింది.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)