Corona in TS: తెలంగాణలో కొత్తగా 202 కరోనా కేసులు నమోదు, ప్రస్తుతం రాష్ట్రంలో 3,940 యాక్టివ్ కేసులు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 52 కొత్త కేసులు
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 46,808 కరోనా పరీక్షలు నిర్వహించగా, 202 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 52 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 19, రంగారెడ్డి జిల్లాలో 18, నల్గొండ జిల్లాలో 16, వరంగల్ అర్బన్ జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి. కొమరంభీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 190 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,69,365 పాజిటివ్ కేసులు నమోదు కాగా.... 6,61,484 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,940 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,941కి పెరిగింది.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)