Corona in TS: తెలంగాణలో కొత్తగా 208 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో 49 కొత్త కేసులు నమోదు

తెలంగాణలో కరోనా వ్యాప్తి బాగా తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో 45,274 కరోనా పరీక్షలు నిర్వహించగా, 208 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 49 కొత్త కేసులు నమోదు కాగా, వరంగల్ అర్బన్ జిల్లాలో 20, కరీంనగర్ జిల్లాలో 15, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 15, ఖమ్మం జిల్లాలో 12, మంచిర్యాల జిల్లాలో 11 కేసులు వెలుగు చూశాయి.

Coronavirus in US (Photo Credits: PTI)

తెలంగాణలో కరోనా వ్యాప్తి బాగా తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో 45,274 కరోనా పరీక్షలు నిర్వహించగా, 208 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 49 కొత్త కేసులు నమోదు కాగా, వరంగల్ అర్బన్ జిల్లాలో 20, కరీంనగర్ జిల్లాలో 15, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 15, ఖమ్మం జిల్లాలో 12, మంచిర్యాల జిల్లాలో 11 కేసులు వెలుగు చూశాయి.వికారాబాద్, నారాయణపేట, కొమరంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 220 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,63,662 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,54,765 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 4,991 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,906కి పెరిగింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement