Corona in TS: తెలంగాణలో కొత్తగా 218 మందికి కరోనా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 69 కొత్త కేసులు

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 46,578 కరోనా పరీక్షలు నిర్వహించగా, 218 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 69 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 15, కరీంనగర్ జిల్లాలో 14, నల్గొండ జిల్లాలో 14 కేసులు వెల్లడయ్యాయి.

Coronavirus-in-India ( photo-PTI)

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 46,578 కరోనా పరీక్షలు నిర్వహించగా, 218 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 69 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 15, కరీంనగర్ జిల్లాలో 14, నల్గొండ జిల్లాలో 14 కేసులు వెల్లడయ్యాయి. నిర్మల్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 248 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,66,971 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,58,657 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,390 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,924కి పెరిగింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement