Corona in TS: తెలంగాణలో కొత్తగా 220 మందికి కరోనా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 71 కొత్త కేసులు, 5,351 మందికి ఇంకా కొనసాగుతున్న చికిత్స

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 51,004 కరోనా పరీక్షలు నిర్వహించగా, 220 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 71 కొత్త కేసులు నమోదు కాగా, నల్గొండ జిల్లాలో 17, ఖమ్మం జిల్లాలో 12, రంగారెడ్డి జిల్లాలో 12 కేసులు వెల్లడయ్యాయి.

Coronavirus | Representational Image | (Photo Credits: Pixabay)

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 51,004 కరోనా పరీక్షలు నిర్వహించగా, 220 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 71 కొత్త కేసులు నమోదు కాగా, నల్గొండ జిల్లాలో 17, ఖమ్మం జిల్లాలో 12, రంగారెడ్డి జిల్లాలో 12 కేసులు వెల్లడయ్యాయి. వికారాబాద్, నిర్మల్, నారాయణపేట, కామారెడ్డి, జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 338 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,61,006 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,51,763 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,351 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,892కి పెరిగింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement