Covid in TS: తెలంగాణలో కొత్తగా 12 మందికి కరోనా, అత్యధికంగా హైదరాబాదులో 8 కొత్త కేసులు నమోదు
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 10,348 కరోనా పరీక్షలు నిర్వహించగా, 12 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా హైదరాబాదులో 8 కొత్త కేసులు నమోదు కాగా, జోగులాంబ గద్వాల జిల్లాలో 1, ఆదిలాబాద్ జిల్లాలో 1, నాగర్ కర్నూలు జిల్లాలో 1, కామారెడ్డి జిల్లాలో 1 కేసు గుర్తించారు.
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 10,348 కరోనా పరీక్షలు నిర్వహించగా, 12 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా హైదరాబాదులో 8 కొత్త కేసులు నమోదు కాగా, జోగులాంబ గద్వాల జిల్లాలో 1, ఆదిలాబాద్ జిల్లాలో 1, నాగర్ కర్నూలు జిల్లాలో 1, కామారెడ్డి జిల్లాలో 1 కేసు గుర్తించారు. అదే సమయంలో 49 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 7,91,328 మంది కరోనా బారినపడగా, వారిలో 7,86,927 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 290 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)