Corona in TS: తెలంగాణలో కొత్తగా 3,877 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,189 కేసులు నమోదు

తెలంగాణలో కరోనా వ్యాప్తి నిలకడగా కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 1,01,812 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా... 3,877 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,189 కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 348, రంగారెడ్డి జిల్లాలో 241, హనుమకొండ జిల్లాలో 140, నల్గొండ జిల్లాలో 133 కేసులు గుర్తించారు.

Coronavirus | Representational Image | (Photo Credits: ANI)

తెలంగాణలో కరోనా వ్యాప్తి నిలకడగా కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 1,01,812 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా... 3,877 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,189 కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 348, రంగారెడ్డి జిల్లాలో 241, హనుమకొండ జిల్లాలో 140, నల్గొండ జిల్లాలో 133 కేసులు గుర్తించారు. అదే సమయంలో 2,981 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,54,976 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,10,479 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 40,414 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 4,083కి పెరిగింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement