Covid in TS: తెలంగాణలో 3 వేలు దాటిన యాక్టివ్ కేసులు, గత 24 గంటల్లో 496 మందికి పాజిటివ్ గా నిర్ధారణ,హైదరాబాదులో అత్యధికంగా 341 కొత్త కేసులు

తెలంగాణలో గత కొన్నిరోజులుగా 400కి పైగా రోజువారీ కేసులు నమోదవుతుండగా, రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3 వేలు దాటింది. గడచిన 24 గంటల్లో 28,808 కరోనా పరీక్షలు నిర్వహించగా, 496 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 341 కొత్త కేసులు వెల్లడయ్యాయి

Coronavirus | Representational Image | (Photo Credits: ANI)

తెలంగాణలో గత కొన్నిరోజులుగా 400కి పైగా రోజువారీ కేసులు నమోదవుతుండగా, రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3 వేలు దాటింది. గడచిన 24 గంటల్లో 28,808 కరోనా పరీక్షలు నిర్వహించగా, 496 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 341 కొత్త కేసులు వెల్లడయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 68, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 40, సంగారెడ్డి జిల్లాలో 15 కేసులు గుర్తించారు. అదే సమయంలో 205 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 7,98,621 మంది కరోనా బారినపడగా, వారిలో 7,90,897 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,613 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మృతి చెందారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement