Corona in TS: తెలంగాణలో కొత్తగా 569 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో 133 కొత్త కేసులు నమోదు
తెలంగాణలో గత 24 గంటల్లో 569 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రాష్ట్రవ్యాప్తంగా 51,518 కరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 133 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 49, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 37, నల్గొండ జిల్లాలో 33 కేసులు వెలుగు చూశాయి.
తెలంగాణలో గత 24 గంటల్లో 569 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రాష్ట్రవ్యాప్తంగా 51,518 కరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 133 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 49, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 37, నల్గొండ జిల్లాలో 33 కేసులు వెలుగు చూశాయి. అదే సమయంలో 2,098 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో కరోనా మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,84,631 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,72,145 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 8,379 మంది చికిత్స పొందుతున్నారు.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)