Telangana: తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల, పార్టీ బలోపేతంపై జహీరాబాద్ పార్లమెంటు నియోజక వర్గ నేతలతో భేటీ
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం తెలంగాణ పర్యటనకు వచ్చారు. తెలంగాణలోని పలు పార్లమెంటు నియోజకవర్గాలకు బీజేపీ అధిష్ఠానం పలువురు కేంద్ర మంత్రులను కో ఆర్డినేటర్లుగా నియమించిన సంగతి తెలిసిందే.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం తెలంగాణ పర్యటనకు వచ్చారు. తెలంగాణలోని పలు పార్లమెంటు నియోజకవర్గాలకు బీజేపీ అధిష్ఠానం పలువురు కేంద్ర మంత్రులను కో ఆర్డినేటర్లుగా నియమించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జహీరాబాద్ పార్లమెంటు కో ఆర్డినేటర్గా నియమితులైన నిర్మలా సీతారామన్ గురువారం నుంచి 3 రోజుల పాటు నియోజకవర్గ పరిధిలో పర్యటించనున్నారు.
ఈ పర్యటన నిమిత్తం గురువారం హైదరాబాద్ వచ్చిన నిర్మలా సీతారామన్కు బీజేపీ శ్రేణులు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికాయి.అనంతరం ఆమె నియోజకవర్గ స్థాయి నేతలతో భేటీ అయ్యారు. 3 రోజుల పాటు ఆమె నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆయా ప్రాంతాల స్థానిక నేతలతో భేటీ అవుతూ... పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు.