Bomb Cyclone: అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను, ఇప్పటికే 60 మంది మృతి, 8 అడుగుల మేర మంచులో కూరుకుపోయిన పలు రాష్ట్రాలు

అమెరికాను మంచుతుఫాను గజగజ వణికిస్తోంది. మంచు తుపానులో చిక్కుకొని ఇప్పటివరకు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో న్యూయార్క్‌ వాసులే 27 మంది ఉన్నారు. పశ్చిమ న్యూయార్క్‌లో కొన్ని ప్రాంతాలు 8 అడుగుల మేర మంచులో కూరుకుపోయాయి.

Bomb Cyclone (Photo-Twitter)

అమెరికాను మంచుతుఫాను గజగజ వణికిస్తోంది. మంచు తుపానులో చిక్కుకొని ఇప్పటివరకు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో న్యూయార్క్‌ వాసులే 27 మంది ఉన్నారు. పశ్చిమ న్యూయార్క్‌లో కొన్ని ప్రాంతాలు 8 అడుగుల మేర మంచులో కూరుకుపోయాయి.

ఏకధాటిగా మంచు కురుస్తూ ఉండడంతో ప్రజలు రోడ్లపైకి రావడం అసాధ్యంగా మారిందని న్యూయార్క్‌ గవర్నర్‌ వెల్లడించారు. దేశవ్యాప్తంగా 15 వేలకు పైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో చికాగో, డెన్వర్, డెట్రాయిట్, న్యూయార్క్, అట్లాంటా విమానాశ్రయాల్లో ప్రయాణికులు చిక్కుకుపోయారు. కొలరాడో, కన్సాస్, కెంటకీ, మిస్సోరీ, ఓహియోలో ప్రాణనష్టం అధికంగా ఉంది.

అమెరికాలో తూర్పు రాష్ట్రాలన్నీ డీప్‌ ఫ్రిజ్‌లో పెట్టినట్టుగా ఉన్నాయని అమెరికా నేషనల్‌ వెదర్‌ సర్వీసెస్‌ (ఎన్‌డబ్ల్యూఎస్‌) తెలిపింది.అమెరికాలోని 48 రాష్ట్రాల్లో మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.ఈ రాష్ట్రాల జనాభాలో 2 లక్షలకు మందికి పైగా విద్యుత్‌ సదుపాయం లేక విలవిలలాడిపోతున్నారు.ప్రజలు ఇల్లు కదిలి బయటకు రావద్దని ఎన్‌డబ్ల్యూఎస్‌ హెచ్చరికలు జారీ చేసింది.

Here's DD News Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement