Cargo Ship Hijacked: భారత్ రావాల్సిన కార్గో షిప్‌ హైజాక్.. ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారుల దుశ్చర్య.. నౌకలో 25 మంది సిబ్బంది

తుర్కియే నుంచి భారత్‌ కు రావాల్సిన కార్గో షిప్‌ ‘గెలాక్సీ లీడర్’ హైజాక్‌ కు గురైంది. ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు ఈ నౌకను హైజాక్ చేశారని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

Cargo Ship Hijacked (Credits: X)

Newdelhi, Nov 20: తుర్కియే నుంచి భారత్‌ కు (India) రావాల్సిన కార్గో షిప్‌ ‘గెలాక్సీ లీడర్’ (Galaxy Leader) హైజాక్‌ (Hijack)కు గురైంది. ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు ఈ నౌకను హైజాక్ చేశారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ షిప్‌ లో వేర్వేరు దేశాలకు చెందిన 25 మంది సిబ్బంది ఉన్నారని సమాచారం. తాము ఇజ్రాయెల్ నౌకను స్వాధీనం చేసుకున్నామని హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. కార్గో షిప్ హైజాక్‌కు గురైన విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ నిర్ధారించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించింది. మరోవైపు.. ఈ నౌకలో భారతీయులు ఎవరూలేరని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం వెల్లడించింది.

Ayodhya Temple: అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు ముహూర్తం ఫిక్స్‌.. జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు కార్యక్రమం

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement