India-Canada Tension: భారత్-కెనడా మధ్య ఉద్రిక్తతలు, నేటి నుంచి కెనడాకు వీసా సేవలను నిలిపివేసిన భారత్, భారతీయులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచన
భారత్-కెనడా మధ్య ఉద్రిక్తతల నేపధ్యంలో కెనడియన్లకు వీసా సేవలను (Visa Services) భారత్ గురువారం నిలిపివేసింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందని కెనడా ఆరోపించిన అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
భారత్-కెనడా మధ్య ఉద్రిక్తతల నేపధ్యంలో కెనడియన్లకు వీసా సేవలను (Visa Services) భారత్ గురువారం నిలిపివేసింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందని కెనడా ఆరోపించిన అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. నిర్వహణ పరమైన కారణాలతో సెప్టెంబర్ 21 నుంచి భారతీయ వీసా సేవలు తదుపరి నోటీసులు వెలువడే వరకూ నిలిచిపోయాయని కెనడియన్ల వీసా దరఖాస్తులను పరిశీలించేందుకు నియమించిన ప్రైవేట్ ఏజెన్సీ బీఎల్ఎస్ తన వెబ్సైట్లో పేర్కొంది.కెనడియన్ల వీసా సేవల నిలిపివేతను భారత్ అధికారులు ధ్రువీకరించారు. ఇక భారత్, కెనడా మధ్య సంబంధాలు దెబ్బతినడంతో కెనడాలో భారతీయులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తమ పౌరులకు భారత్ మార్గదర్శకాలకు జారీ చేసింది.
Here's ANI Tweet