Israel-Hamas War: రాత్రికి రాత్రే గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్, 200 మిలిటెంట్ స్థావరాలు కూల్చివేత, పాలస్తీనా వాసులు గాజాను తక్షణమే ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశాలు
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) దాడులతో ఇజ్రాయెల్ (Israel) ఉక్కిరిబిక్కిరవుతోంది. తమ దేశంపై హమాస్ (Hamas) చేపట్టిన దాడులను ఇజ్రాయెల్ (Israel) ధీటుగా ఎదుర్కొంటోంది. ఇందులో భాగంగా మిలిటెంట్ల పాలనలో ఉన్న గాజా (Gaza)పై విరుచుకుపడుతోంది
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) దాడులతో ఇజ్రాయెల్ (Israel) ఉక్కిరిబిక్కిరవుతోంది. తమ దేశంపై హమాస్ (Hamas) చేపట్టిన దాడులను ఇజ్రాయెల్ (Israel) ధీటుగా ఎదుర్కొంటోంది. ఇందులో భాగంగా మిలిటెంట్ల పాలనలో ఉన్న గాజా (Gaza)పై విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో రాత్రికి రాత్రే గాజాలోని 200 మిలిటెంట్ స్థావరాలపై దాడులు చేసింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (The Israeli Air Force) తాజాగా ప్రకటించింది.
గాజాలోని 200 మిలిటెంట్ స్థావరాలపై నిన్న రాత్రి దాడులు చేశాం. మిలిటెంట్లు ఆయుధాలు దాచిన ఓ ప్రార్థనా మందిరం, ఒక అపార్ట్మెంట్ భవనాన్ని కూడా కూల్చేశాం. పలు సైనిక లక్ష్యాలను కూడా ధ్వంసం చేశాం’ అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించింది. మరోవైపు పాలస్తీనా వాసులు గాజాను తక్షణమే ఖాళీ చేసి అక్కడి నుంచి వీలైనంత త్వరగా వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం సూచించింది.
Here's Video