Japan Earthquake: జపాన్ భూకంపంలో 100కు పెరిగిన మృతుల సంఖ్య, ఇంకా చిక్కని గల్లంతైన 211 మంది ఆచూకీ, కొనసాగుతున్న సహాయక చర్యలు

జపాన్‌ దేశాన్ని గంటల వ్యవధిలో 155 కంటే ఎక్కువ సార్లు రిక్టరు స్కేలుపై 4 కంటే ఎక్కువ తీవ్రతతో భూప్రకంపనలు వణికించిన సంగతి విదితమే. నోటో ద్వీప‌క‌ల్పంలో 7.6 తీవ్రత‌తో వచ్చిన భూకంపం వ‌ల్ల పెను న‌ష్టమే వాటిల్లింది. ఈ భూకంపం ఘటనలో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 100కి పెరిగింది.

Japan earthquake

జపాన్‌ దేశాన్ని గంటల వ్యవధిలో 155 కంటే ఎక్కువ సార్లు రిక్టరు స్కేలుపై 4 కంటే ఎక్కువ తీవ్రతతో భూప్రకంపనలు వణికించిన సంగతి విదితమే. నోటో ద్వీప‌క‌ల్పంలో 7.6 తీవ్రత‌తో వచ్చిన భూకంపం వ‌ల్ల పెను న‌ష్టమే వాటిల్లింది. ఈ భూకంపం ఘటనలో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 100కి పెరిగింది. సుమారుగా 500 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటనలో గల్లంతైన 211 మంది ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. ఆచూకీ లేకుండా పోయిన వారి జాడ కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో బాధితులు ఇళ్ల శిథిలాల కిందే చిక్కుకుపోయి ఉన్నారు. ప్రస్తుతం వారిని రక్షించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement