T20 Tickets: హైదరాబాదీ క్రికెట్ ఫ్యాన్స్ అలర్ట్.. ఆస్ట్రేలియా, భారత్ మూడో టీ20 మ్యాచ్ టికెట్లన్నీ అమ్ముడయ్యాయి.. ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు మాత్రమే జింఖానా మైదానంకు వచ్చి ఫిజికల్ టికెట్లు తీసుకోవాలి.. హెచ్ సీఏ కీలక ప్రకటన

ఆస్ట్రేలియా, భారత్ మూడో టీ20 మ్యాచ్ కి సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడయ్యాయని హైదరాబాద్ క్రికెట్ సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. ఇదివరకు ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు మాత్రమే జింఖానా మైదానంకు వచ్చి ఫిజికల్ టికెట్లు తీసుకోవాలని తెలిపింది.

Tickets

Hyderabad, September 23: ఆస్ట్రేలియా, భారత్ మూడో టీ20 మ్యాచ్ (T20 Match) కి సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడయ్యాయని హైదరాబాద్ క్రికెట్ సంఘం (HCA) ఒక ప్రకటనలో తెలిపింది. ఇదివరకు ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు మాత్రమే జింఖానా మైదానంకు వచ్చి ఫిజికల్ టికెట్లు (Physical Tickets) తీసుకోవాలని తెలిపింది. ఇందుకోసం శుక్ర, శని, ఆదివారాల్లో కౌంటర్లు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటాయని చెప్పింది.

ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న వాళ్లు ఈ మెయిల్ కన్ఫర్మే షన్ చూపించడంతో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించాలని, దాని జిరాక్స్ ను కూడా ఇచ్చి ఫిజికల్ టికెట్లు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఇతరులు బుక్ చేసిన టికెట్లను తీసుకోవాలంటే ఇద్దరి ఫొటో గుర్తింపు కార్డులు, జిరాక్సులను జత చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ.. ఫిజికల్ టికెట్లు ఉంటేనే ఆదివారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ కు అనుమతి ఉంటుందని హైదరాబాద్ క్రికెట్ సంఘం స్పష్టం చేసింది.

తిరుమల భక్తులకు ముఖ్య గమనిక.. బ్రహ్మోత్సవాల వేళ 12 వేల వాహనాలకే అనుమతి.. కరోనా కారణంగా రెండేండ్ల నుంచి నిలిచిపోయిన బ్రహ్మోత్సవాలు.. ఇప్పుడే తిరిగి ప్రారంభం..

కౌంటర్లలో టికెట్లు విక్రయిస్తామని హైదరాబాద్ క్రికెట్ సంఘం ప్రకటించడంతో గురువారం భారీ సంఖ్యలో జింఖానా మైదానం వద్దకు వచ్చిన అభిమానుల మధ్య తోపులాట జరిగి పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో హెచ్ సీఏపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. చివరి నిమిషం వరకూ కౌంటర్లలో టికెట్ల విక్రయంపై సరైన ప్రకటన ఇవ్వకపోవడంతోపాటు జింఖానా మైదానం వద్ద సరైన ఏర్పాట్లు చేయలేకపోయిందని పలువురు ఆరోపించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Delhi elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు.. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్, త్రిముఖ పోరులో గెలిచేది ఎవరో!

WPL on 1xBet Platform: క్రీడా ప్రేమికులకు గుడ్ న్యూస్, 1xBet వేదికపై ఉమెన్స్ ప్రీమియర్ లీగ్, భారీగా బహుమతులు గెలుచుకునే అవకాశం

Gongadi Trisha: అండ‌ర్‌-19 టీ20 వ‌ర‌ల్డ్‌ క‌ప్ 'ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీ' హైద‌రాబాద్ కు.. తెలుగ‌మ్మాయి త్రిష‌కు ఘ‌న స్వాగ‌తం.. ఇదిగో వీడియో!

Tensions Erupt in Tadipatri: తన ఇంటికి వెళ్లడానికి వీసా కావాలా, ఎక్కడుందో చెబితే అప్లై చేసుకుంటా, పోలీసులపై మండిపడిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చగొడుతున్నారని విమర్శ

Share Now