IND vs SA: భారత టూర్‌కి సఫారీలు రెడీ, పొట్టి ప్రపంచకప్‌ తర్వాత సఫారీ జట్టు ఆడనున్న తొలి టీ20 సిరీస్‌, దక్షిణాఫ్రికా జట్టు పూర్తి వివరాలు ఇవే

వచ్చే నెలలో టీమ్‌ఇండియాతో జరుగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం మంగళవారం దక్షిణాఫ్రికా16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన పొట్టి ప్రపంచకప్‌ అనంతరం.. సఫారీ జట్టు ఆడనున్న తొలి టీ20 సిరీస్‌ ఇదే

India vs South Africa (Twitter)

వచ్చే నెలలో టీమ్‌ఇండియాతో జరుగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం మంగళవారం దక్షిణాఫ్రికా16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన పొట్టి ప్రపంచకప్‌ అనంతరం.. సఫారీ జట్టు ఆడనున్న తొలి టీ20 సిరీస్‌ ఇదే కాగా.. ఐదేండ్ల తర్వాత వేన్‌ పార్నెల్‌ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. జూన్‌ 9 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్‌లో సఫారీ టీమ్‌కు టెంబా బవుమా సారథ్యం వహించనుండగా.. ట్రిస్టాన్‌ స్టబ్స్‌ తొలిసారి జట్టుకు ఎంపికయ్యాడు.

గాయం నుంచి కోలుకొని ప్రస్తుతం ఐపీఎల్లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న నోర్జేతో పాటు సీనియర్‌ ఆటగాళ్లు రీజా హెండ్రిక్స్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌కు చాన్స్‌ లభించింది. భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య వచ్చే నెల 9న ఢిల్లీ వేదికగా తొలి టీ20 జరుగనుండగా.. ఆ తర్వాత వరుసగా కటక్‌ (జూన్‌ 12), విశాఖపట్నం (జూన్‌ 14), రాజ్‌కోట్‌ (జూన్‌ 17), బెంగళూరు (జూన్‌ 19)లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

దక్షిణాఫ్రికా జట్టు: బవుమా (కెప్టెన్‌), డికాక్‌, హెండ్రిక్స్‌, క్లాసెన్‌, కేశవ్‌, మార్క్మ్‌,్ర మిల్లర్‌, ఎంగ్డీ, నోర్జే, పార్నెల్‌, ప్రిటోరియస్‌, రబడ, షంసీ, స్టబ్స్‌, డసెన్‌, జాన్సెన్‌.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

KTR Delhi Tour Updates: ఢిల్లీకి కేటీఆర్.. పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టు లాయర్లతో మంతనాలు, మూడు రోజులు ఢిల్లీలోనే ఉండే ఛాన్స్!

Delhi elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు.. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్, త్రిముఖ పోరులో గెలిచేది ఎవరో!

Andhra Pradesh: ఏలూరులో దారుణం, ఎమ్మారై స్కానింగ్ చేస్తుండగా రేడియేషన్ తట్టుకోలేక మహిళ మృతి, సుష్మితా డయాగ్నస్టిక్‌ సెంటర్‌ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని భర్త ఆందోళన

PM Modi Speech in Lok Sabha: పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని జయించారు, లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చ సందర్భంగా ప్రధాని మోదీ

Share Now