Credit @ Twitter

Malborne, OCT 23: పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో (IND vs PAK) భారత్ అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) వీరోచిత ఇన్నింగ్స్‌ కారణంగా భారత్ ఈ విజయం దక్కించుకుంది. దీంతో భారత క్రీడాభిమానులంతా విరాట్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మ్యాచ్ చివరి వరకు క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ.. గెలుపు అనంతరం తీవ్ర భావోద్వేగానికి (emotional ) గురయ్యాడు. భారత్ మ్యాచ్ గెలవగానే, కోహ్లీ ఆనందంతో పిచ్ చుట్టూ పరుగెత్తుకుంటూ వచ్చాడు. అనంతరం మోకాళ్లపై కూర్చుని తన ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు. ఆ తర్వాత తన టీమ్‌మేట్స్ వచ్చినప్పుడు మరింత భావోద్వేగానికి గురయ్యాడు. తనను అందరూ అభినందిస్తున్నప్పుడు అతడి కళ్లు చెమర్చాయి.

ఈ మ్యాచులో విరాట్ కోహ్లీ (Virat Kohli) 53 బంతులతో 82 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఒక వైపు వికెట్లు పడిపోతుంటే తను ధాటిగా ఆడుతూ ఇండియాను విజయంవైపు చేర్చాడు. మరోవైపు కోహ్లీకి హార్ధిక్ పాండ్యా తోడయ్యాడు. ఇద్దరూ కలిసి భారత్‌కు మర్చిపోలేని విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్ క్రీడాభిమానులకు అసలైన క్రికెట్ మజాను అందించింది.



సంబంధిత వార్తలు

Pakistan Road Accident: పాకిస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సు అదుపు తప్పి లోయలో పడటంతో 20 మంది మృతి, మరికొందరికి తీవ్ర గాయాలు

T20 World Cup 2024 Squads: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ కోసం తమ జట్లను ప్రకటించిన అన్ని దేశాలు, జూన్ 1 నుంచి 29వ తేదీ వ‌ర‌కు ఐసీసీ 2024 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌

Champions Trophy in Pakistan: పాకిస్తాన్ గడ్డ మీద టీమిండియా కాలు పెడుతుందా? ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీ వేదికలను ఖరారు చేసిన పాకిస్తాన్

Virender Sehwag-Team India: టీ20 వరల్డ్ కప్-2024కు వీరేంద్ర సెహ్వాగ్ ప్రకటించిన టీమిండియా జట్టు ఇదిగో, హార్థిక్ పాండ్యాకు రెస్ట్, రిషబ్ పంత్ కు చోటు

Sarabjit Singh’s Killer Shot Dead in Pakistan: స‌ర‌బ్ జిత్ సింగ్ హంత‌కుడ్ని కాల్చి చంపిన దుండ‌గులు, పాక్ ఉగ్ర‌వాది హ‌ఫీజ్ స‌యీద్ కు అత్యంత స‌న్నిహితుడిగా పేరొందిన తంబా

IPL 2024, PBKS vs SRH: హైటెన్షన్ మ్యాచులో పంజాబ్ ను చిత్తు చేసిన హైదరాబాద్ సన్ రైజర్స్..పంజాబ్ పై 2 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం

Balochistan Attack: పాకిస్థాన్ నేవీ స్టేష‌న్ పై ఉగ్ర‌దాడి, వారంలో రెండోసారి అటాక్ చేసేందుకు య‌త్నించిన తిరుగుబాటుదారులు, సైన్యం కాల్పుల్లో 4గురు ఉగ్ర‌వాదులు మృతి

POK Will Merge With India: పీవోకే భారత్‌లో ఎప్పటికైనా విలీనమవుతుంది, విశ్వాసం వ్యక్తం చేసిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఇంకా ఏమన్నారంటే..