Andhra Pradesh Shocker: రాజమండ్రిలో ఘోర ప్రమాదం, బాణాసంచా తయారు చేస్తున్న ఇంట్లో భారీ పేలుడు, ఒకరు మృతి

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం బాణాసంచా తయారు చేస్తున్న ఓ ఇంట్లో పేలుడు సంభవించి ఒకరు మృతి చెందారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చోటుచేసుకుంది.దీపావళి రోజున జరిగిన ఈ దుర్ఘటనలో జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఉన్న ఇల్లు పూర్తిగా దెబ్బతింది.

Representational image | Photo Credits: Flickr

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం బాణాసంచా తయారు చేస్తున్న ఓ ఇంట్లో పేలుడు సంభవించి ఒకరు మృతి చెందారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చోటుచేసుకుంది.దీపావళి రోజున జరిగిన ఈ దుర్ఘటనలో జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఉన్న ఇల్లు పూర్తిగా దెబ్బతింది. ఘటన జరిగినప్పుడు బాధితుడి భార్య, ఇద్దరు పిల్లలు ఇంట్లో లేరు. వంటగ్యాస్ సిలిండర్ కూడా పేలడంతో ఇల్లు మొత్తం నేలకూలింది.

పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పండగ సందర్భంగా అక్రమంగా పటాకులను విక్రయిస్తున్నాడని అధికారులు తెలిపారు.కాగా విజయవాడలోని బాణాసంచా దుకాణంలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. విజయవాడ గాంధీనగర్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో వ్యాపారులు పటాకుల దుకాణాలు ఏర్పాటు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. భారీ పేలుళ్లు సంభవించిన మంటల్లో 19 దుకాణాల్లో మూడు పూర్తిగా దగ్ధమయ్యాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement