AP Cabinet Meeting Highlights: రూ. 99కే క్వాలిటీ మద్యం, నూతన మద్యం విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం, మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవిగో..

AP cabinet meeting Concluded (Photo/APCMO)

Vjy, Sep 18: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఏపీ కేబినెట్‌ భేటీ ముగిసింది. ఈ భేటీలో నూతన మద్యం విధానానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. సగటు మద్యం ధర రూ.99 నుంచి అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.100 లోపు నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవాలని మంత్రి వర్గం నిర్ణయించింది. రూ.99కే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు ప్రకటించిన వరద సాయం ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఇక రాష్ట్రంలో మహిళలకు ఎన్డీయే ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సూపర్‌ సిక్స్‌లో భాగంగా ప్రకటించిన ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ పథకాన్ని దీపావళి పండుగ సందర్భంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఇదే విషయాన్ని ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మహాశక్తి పథకం కింద పేదలకు ఉచితంగా మూడు వంట గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని చంద్రబాబు ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా తెల్ల రేషన్‌ కార్డు ఉన్న లబ్ధిదారులకు.. ప్రతి ఇంటికి 3 గ్యాస్‌ సిలిండర్లను ఉచితంగా ప్రభుత్వం అందించనుంది.

ఏపీలో లాటరీ ద్వారా మద్యం షాపుల లైసెన్సులు కేటాయింపు, ముందుగా 3,396 దుకాణాలు నోటిఫై, కీలక నిర్ణయం దిశగా ఏపీ ప్రభుత్వం

ఏపీ కేబినెట్‌ భేటీలో (AP Cabinet Meeting Highlights) తీసుకున్న నిర్ణయాలు, చర్చించిన అంశాలు, ఆమోదం తెలిపిన అంశాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు.వాలంటీర్, సచివాలయ వ్యవస్థలను ప్రభుత్వ శాఖలతో సమీకృతం చేస్తూ ఒక సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రిమండలి సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు.

Here's Video

రాష్ట్రంలో మొత్తం 2.63 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారని, వారిలో 1.07 లక్షల మంది రాజీనామా చేశారని పార్థసారథి వివరించారు. పాలన అంతా వాలంటీర్ల మీదే నడుస్తోంది అన్నట్టుగా గత ప్రభుత్వం ప్రచారం చేసుకుందని విమర్శించారు. వాలంటీర్లే మెరుగైన సేవలు అందిస్తున్నారు, ప్రభుత్వ విజయానికి వారే ముఖ్య కారకులని కూడా చెప్పుకున్న గత ప్రభుత్వం... 2023 ఆగస్టు 15 తర్వాత వారి సేవలను పొడిగించకుండా ఎందుకు మోసం చేసిందన్నది అర్థంకాని విషయం అని పేర్కొన్నారు.

2023లోనే వాలంటీర్ల పదవీకాలం ముగిస్తే, ఎందుకు పొడిగించలేదని ప్రశ్నించారు. వాలంటీర్లు సర్వీస్ లో ఉన్నారో, లేదో కూడా అర్థంకాని పరిస్థితి నెలకొందని అన్నారు. ఇలా వాలంటీర్లను మోసం చేయడానికి కారణాలేంటో కూడా గత ప్రభుత్వంలో ఉన్నవారే చెబితే బాగుంటుందని మంత్రి పార్థసారథి సూచించారు. ఏదేమైనా గానీ సమగ్ర నివేదికతో రావాలని సంబంధిత శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని, వాలంటీర్ల విషయంలో తమ ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

ఇక, వాలంటీర్లకు దినపత్రిక కొనుగోలు చేసేందుకు ప్రతినెలా ఇస్తున్న రూ.200 రద్దు చేస్తున్నట్టు మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. దినపత్రిక కొనుగోలుకు సంవత్సరానికి గత ప్రభుత్వంలో రూ.102 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. దినపత్రిక కొనుగోలుపై విచారణకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు.

మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు..

పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సీడబ్ల్యూసీ సూచనల మేరకు పాత ఏజన్సీకే ఇవ్వాలని నిర్ణయం. ఒకే ఏజెన్సీకే పనులు కేటాయించడం వల్ల తదనంతరం ఏమైనా సమస్యలు తలెత్తినా ఏజెన్సీ బాధ్యత ఉంటుందని అభిప్రాయపడిన మంత్రివర్గం

ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిస్తూ ‘స్టెమీ’ పథకం ప్రారంభం

ఆధార్‌ తరహాలో విద్యార్థులకు ‘అపార్‌’ గుర్తింపు కార్డులు

హోంశాఖలో కొత్త కార్పొరేషన్‌ ఏర్పాటు.. కొత్త కార్పొరేషన్‌కు రూ.10 కోట్ల కార్పస్‌ ఫండ్‌

వాలంటీర్లను, సచివాలయాలను వివిధ శాఖాల్లో కలిపేలా చర్యలు

ఇంటింటికి వెళ్లి 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలన గురించి వివరించేలా కార్యాచరణ

నూతన మద్యం విధానంపై మంత్రివర్గ సమావేశంలో చర్చ

అందుబాటులోకి నాణ్యమైన మద్యం బ్రాండ్లు... సగటు మద్యం ధర రూ.99గా నిర్ణయం

భోగాపురం ఎయిర్ పోర్టు పేరును మార్చేందుకు క్యాబినెట్ నిర్ణయం

ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ 'స్టెమీ' పథకం

ఆధార్ తరహాలో విద్యార్థులకు 'అపార్' గుర్తింపు కార్డులు

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన

రాష్ట్ర హోంశాఖలో కొత్త కార్పొరేషన్ ఏర్పాటు... కార్పస్ ఫండ్ గా రూ.10 కోట్లు

ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి డీమ్డ్ హోదా ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం

రూ.1000 కోట్లతో రాష్ట్రంలో బిట్స్-పిలానీ విద్యాసంస్థ స్థాపనకు చర్యలు

చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రానికి సిఫారసు

కౌలు కార్డుల నమూనా మార్చాలని క్యాబినెట్ నిర్ణయం. రైతు సంతకం అవసరం లేకుండానే కౌలు కార్డుల జారీ

పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు పాత ఏజెన్సీకే ఇవ్వాలని నిర్ణయం

మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటుకు క్యాబినెట్ నిర్ణయం

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now