AP MLC Elections: ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైఎస్సార్సీపీ, 18 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు, సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని తెలిపిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి
ఏపీలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ నుంచి అభ్యర్థులు ఖరారు అయ్యారు.తాజాగా స్థానిక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు, గవర్నర్ కోటాలో అభ్యర్థుల పేర్లను వైఎస్సార్సీపీ ప్రకటిచింది. 18 ఎమ్మెల్సీ స్థానాలను గాను అభ్యర్థుల పేర్లను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సోమవారం ప్రకటించారు.
VJY, Feb 20: ఏపీలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ నుంచి అభ్యర్థులు ఖరారు అయ్యారు.తాజాగా స్థానిక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు, గవర్నర్ కోటాలో అభ్యర్థుల పేర్లను వైఎస్సార్సీపీ ప్రకటిచింది. 18 ఎమ్మెల్సీ స్థానాలను గాను అభ్యర్థుల పేర్లను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సోమవారం ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు స్థానం కల్పించారు.
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సామాజిక న్యాయానికి వైఎస్సార్సీపీ కట్టుబడి ఉంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేశాము. బీసీలంటూ బ్యాక్వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్బోన్ క్లాస్. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చాము. ఓట్ల కోసం నినాదాలు ఇచ్చే పార్టీ మాది కాదు. వారిని అధికారంలో భాగస్వామ్యం చేశాం. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనది అంటూ కామెంట్స్ చేశారు.
టీడీపీ హయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మండలిలో 37 శాతం ప్రాతినిధ్యం కల్పిస్తే.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం బీసీలకే 43 శాతం ఎమ్మెల్సీ పదవులు ఇచ్చింది. మండలిలో బీస్సీ, ఎస్సీ, ఎస్టీలకు 68 శాతం ఎమ్మెల్సీ పదవులు ఇచ్చామన్నారు. సామజిక సాధికారిత అంటే మాదే. చంద్రబాబు మాటలు చెబితే మేము చేతల్లో చూపించాము అని స్పష్టం చేశారు. చంద్రబాబు హయంలో 62.5 ఓసీలు, 32 శాతం బీసీలు ఉన్నారు. 87 మున్సిపాలిటీల్లో 84 చోట్ల గెలిచాము. 44 మంది మున్సిపల్ ఛైర్మన్లు బీసీలే ఉన్నారు.
ఈ సందర్భంగానే.. ఎమ్మెల్యే కోటాలో ఏడుగురు, స్థానిక కోటాలో 9 మంది అభ్యర్థులు, గవర్నర్ కోటాలో మరో ఇద్దరి పేర్లను ప్రకటించారు. కాగా, 18 స్థానాలకు గాను బీసీలకు 11, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1, ఓసీలకు 4 స్థానాలకు కేటాయించారు.
వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..
స్థానిక సంస్థలు..
- నత్తు రామారావు.. శ్రీకాకుళం, లోకల్ కోటా (బీసీ, యాదవ)
- కుడుపూడి సూర్యనారాయణ.. తూర్పు గోదావరి, లోకల్ కోటా (బీసీ-శెట్టి బలిజ)
- వంకా రవీంద్రనాథ్.. పశ్చిమ గోదావరి, లోకల్ కోటా (పారిశ్రామికవేత్త)
- కవురు శ్రీనివాస్.. ప.గోదావరి, లోకల్ కోటా( బీసీ-శెట్టి బలిజ)
- మేరుగ మురళి.. నెల్లూరు, లోకల్ కోటా (ఎస్సీ-మాల)
- డా. సిపాయి సుబ్రహ్మణ్యం.. చిత్తూరు, లోకల్ కోటా
- రామసుబ్బారెడ్డి.. కడప, లోకల్ కోటా (ఓసీ-రెడ్డి)
- డాక్టర్ మధుసూదన్.. కర్నూలు, లోకల్ కోటా (బీసీ-బోయ)
- ఎస్. మంగమ్మ.. అనంతపురం, లోకల్ కోటా( బీసీ-బోయ)
ఎమ్మెల్యే కోటా..
- పెనుమత్స సూర్యనారాయణ.. విజయనగరం, ఎమ్మెల్యే కోటా( క్షత్రియ సామాజిక వర్గం)
- పోతుల సునీత.. ప్రకాశం, ఎమ్మెల్యే కోటా (బీసీ- పద్మశాలి)
- కోలా గురువులు.. విశాఖ, ఎమ్మెల్యే కోటా (ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్)
- బొమ్మి ఇజ్రాయిల్.. తూ. గోదావరి, ఎమ్మెల్యే కోటా ( ఎస్సీ-మాదిగ)
- జయమంగళ వెంకటరమణ, ప. గోదావరి, లోకల్ కోటా (వడ్డీల సామాజిక వర్గం)
- ఏసు రత్నం.. గుంటూరు, ఎమ్మెల్యే కోటా ( బీసీ-వడ్డెర)
- మర్రి రాజశేఖర్.. గుంటూరు, ఎమ్మెల్యే కోటా ( కమ్మ)
గవర్నర్ కోటా..
- కుంభా రవి.. అల్లూరి జిల్లా, (ఎస్టీ)
- కర్రి పద్మశ్రీ.. కాకినాడ, (బీసీ)
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)