Vijayawada, April1 14: ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై విజయవాడలో శనివారం రాత్రి రాయితో (Jagan Stone Hits Incident) దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో జగన్‌ ఎడమకంటి పై భాగంలో గాయమైంది. అయితే, ఈ దాడి ఘటనపై తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటరమణారెడ్డి (Anam Venkata Ramana Reddy) పలు సందేహాలు వ్యక్తం చేశారు. ఒకే రాయి మూడు గాయాలు ఎలా చేస్తుందని ఆయన ప్రశ్నించారు. పక్కనే ఉన్న రెండంతస్తుల భవనం నుంచి వచ్చిన ఆ రాయి వచ్చి ముఖ్యమంత్రి జగన్ కంటికి గాయం చేసి.. పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి కంటికి గాయం చేసి, ఆ తర్వాత సీఎం జగన్ (CM Jagan) కాలుపై పడి గాయం అయిందట ? మరి ఈ విషయం ఎందుకు బయటపెట్టలేదని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్ కాలికి బ్యాండేజి కట్టి ఫొటోను ఆనం బయటపెట్టారు. నిన్న ఘటనలో జగన్‌ అద్భుతంగా నటించారంటూ ఎద్దేవా చేశారు. శనివారం రాత్రి 8.15 గంటలకే వలంటీర్లకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్లింది? వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి.. జగన్‌పై హత్యాయత్నం జరిగింది.. టీవీలు చూడాలని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అంటూ నిలదీశారు. 8.10 గంటలకు ఘటన జరిగితే.. 8.13 గంటలకే సోషల్ మీడియా స్క్రోలింగ్ మొదలైంది ఆనం వివరించారు.

Kodali Nani: పక్కా వ్యూహంతోనే సీఎం వైయ‌స్‌ జగన్‌పై దాడి...చంద్రబాబు ప్రేరణతోనే సీఎం జగన్‌పై రాళ్ల దాడి 

దాడి ఘటన అంతా డ్రామా అని.. రాత్రి 7 గంటలకు కరెంటు పోయిందని.. గాల్లో ఉన్న డ్రోన్లన్నీ కిందికి దిగాయన్నారు. పక్కా స్కెచ్‌తోనే దాడి జరిగిందని.. ఈ వ్యవహారంలో పోలీసుల పాత్ర కూడా ఉందని ఆనం ఆరోపించారు. వైఎస్‌ భారతీరెడ్డి డైరెక్షన్‌లోనే దాడి డ్రామా జరిగిందని..సీఎం ర్యాలీలో కరెంట్ ఉండదా? డ్రోన్ విజువల్స్ ఎందుకు లేవు? అంటూ ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం జగన్‌కు పట్టుకుందని.. అందుకు వైఎస్సార్‌సీపీ డ్రామాకు తెరలేపిందంటూ ఆయన ఆరోపించారు.



సంబంధిత వార్తలు

CM Jagan on Election Results: ఏపీలో మనం కొట్టే సీట్లతో ప్రశాంత్ కిషోర్ మైండ్ బ్లాక్ అయిపోద్ది, ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ మోహన్ రెడ్డి

CM Jagan UK Visit: సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి, ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు యూరప్ పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి

Jagan Offered Dy CM Post To Vanga Geetha: వంగా గీత‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన వైఎస్ జ‌గ‌న్, చివ‌రి రోజు ఎన్నిక‌ల ప్ర‌చారంలో కీల‌క హామీ ఇచ్చిన జ‌గ‌న్

Rain Alert to Telugu States: తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. ఐదు రోజుల వరకు వానలు.. దక్షిణ కేరళ మీదుగా కొనసాగుతున్న ఆవర్తన ప్రభావం.. హైదరాబాద్, విజయవాడలో శుక్రవారం దంచికొట్టిన వాన

Andhra Pradesh Elections 2024: ఆరు నూరైనా నూరు ఆరైన నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే, కర్నూలు సభలో స్పష్టం చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి

Andhra Pradesh Elections 2024: తుప్పు పట్టిన సైకిల్ కథ చెప్పిన సీఎం జగన్, చంద్రబాబుపై కోరుకొండలో మరోసారి విరుచుకుపడిన ఏపీ ముఖ్యమంత్రి

CM Jagan Reacts on Officials Transfer: ఏపీలో వ‌రుస బ‌దిలీల‌పై తొలిసారి స్పందించిన సీఎం వైఎస్ జ‌గ‌న్, ఎన్నిక‌లు స‌జావుగా సాగుతాయో లేదో అని అనుమానం

YS Jagan Road show: భారీ వ‌ర్షాన్ని సైతం లెక్క చేయ‌కుండా సీఎం జ‌గ‌న్ స‌భ‌కు పోటెత్తిన జ‌నం, చంద్ర‌బాబుకు ఓటేస్తే కొండ‌చిలువ నోట్లో త‌ల‌పెట్టిన‌ట్లేనన్న జ‌గ‌న్