Jitta Balakrishna Reddy Passes Away: మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి, అనారోగ్యంతో మృతి చెందిన జిట్టా, ప్రజానేతగా గుర్తింపు

మలిదశ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి ఇకలేరు. బ్రెయిన్‌ ఇన్‌ఫెక్షన్‌తో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఇవాళ మృతి చెందారు. అజాత శత్రువుగా గుర్తింపు తెచ్చుకున్నారు జిట్టా. బీఆర్ఎస్ నుండి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసేందుకు తనవంతు పాత్రను పోషించారు.

BRS Leader , Telangana activist Jitta Balakrishna Reddy passes away

Hyd, Sep 6: మలిదశ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి ఇకలేరు. బ్రెయిన్‌ ఇన్‌ఫెక్షన్‌తో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఇవాళ మృతి చెందారు. అజాత శత్రువుగా గుర్తింపు తెచ్చుకున్నారు జిట్టా.

బీఆర్ఎస్ నుండి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసేందుకు తనవంతు పాత్రను పోషించారు. బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు జిట్టా. భువనగిరి నుండి పలుమార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

నల్గొండ జిల్లాలో ప్రధానంగా భువనగిరి ప్రాంత అభివృద్ధికి తనవంతు పాత్ర పోషించారు జిట్టా. ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న ప్రజలను చూసి చలించిపోయి ప్రతి గ్రామంలో డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లు నెలకొల్పారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. నిత్యం ప్రజల కోసం పరితపించే నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు జిట్టా.

Here's Tweet:

అన్ని రాజకీయ పార్టీలతో సత్సంబంధాలు మెయింటెన్ చేశారు జిట్టా. ఇవాళ సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. భువనగిరి శివారులోని మగ్దుంపల్లి రోడ్డులో గల ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు జరగనున్నాయి.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Advertisement
Advertisement
Share Now
Advertisement