KTR Challenges Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంపై తొలిసారి నోరు విప్పిన కేటీఆర్, లై డిటెక్ట‌ర్ ప‌రీక్ష‌కు నేను సిద్ధం, మ‌ల్కాజిగిరిలో పోటీకి రేవంత్ సిద్ధ‌మా? అంటూ స‌వాల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తాను లై డిటెక్టర్ విచారణకు సిద్ధమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పష్టం చేశారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముందుకు రావాలని డిమాండ్ చేశారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం నిర్వహించిన టీవీ9 లైవ్ షో కార్యక్రమంలో కేటీఆర్ పేర్కొన్నారు.

KTR vs Revanth Reddy (Photo- File Image)

Hyderabad, April 12: ఫోన్ ట్యాపింగ్ కేసులో తాను లై డిటెక్టర్ విచారణకు సిద్ధమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పష్టం చేశారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముందుకు రావాలని డిమాండ్ చేశారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం నిర్వహించిన టీవీ9 లైవ్ షో కార్యక్రమంలో కేటీఆర్ పేర్కొన్నారు. ‘100 రోజుల పాలనపై లోక్ సభ ఎన్నికలు రెఫరెండం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని 17 స్థానాల్లో మల్లయుద్ధాలు ఎందుకు.. మల్కాజిగిరి సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన సీటు.. అందుకే మల్కాజిగిరికి రమ్మనండి.. ఒక్కసీటులో ఎవరి సత్తా ఏమిటో తేల్చుకుందాం..దీని మీద మేం డిమాండ్ చేస్తే సీఎం రేవంత్ రెడ్డి నోరు మెదపడం లేదు’ అని చెప్పారు.

 

‘ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ట్యాపింగ్ (Phone Tapping) జరిగిందా.. లేదా.. అన్నది కోర్టులు తేల్చాలి. నేను ఏ తప్పు చేయలేదు.. చేస్తే ఎవరైనా శిక్షార్హుడే..కానీ మీడియాలో ట్రయల్ జరుగుతున్నది ఇది తప్పు. యూట్యూబ్ ల్లో ప్రచారం వాంచనీయం కాదు. ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పుదోవ పట్టించడానికే ఈ ప్రచారం అంతా.. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడం వల్ల ప్రజలకు నష్టం జరుగుతున్నది’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్‌గా నిలిచిన టీమ్‌ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

Advertisement
Advertisement
Share Now
Advertisement