Harishrao: ఉత్సవాల పేరుతో కోట్లాది రూపాయలు వృధా, కనీసం విద్యార్థులకు అన్నం పెట్టలేని స్థితిలో సీఎం రేవంత్ రెడ్డి, అక్రమ కేసులు కాదు విద్యార్థులకు అన్నం పెట్టాలని హరీశ్‌ రావు ఫైర్

3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ,బీసీ పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రశాంత్ నగర్ ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ హాస్టల్ అకస్మిక తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు హరీష్ రావు.

Harish Rao Surprise Visit To Gurukula Hostel In Siddipet, slams CM Revanth Reddy(X)

Siddipet, Dec 13:  3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ,బీసీ పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రశాంత్ నగర్ ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ హాస్టల్ అకస్మిక తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు హరీష్ రావు.

ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కు జూన్ నుండి నవంబర్ వరకు ఆరు నెలలుగా మెస్ చార్జీల విడుదల చేయకపోవడం దుర్మార్గం అని దుయ్యబట్టారు. మెసేజ్ చార్జీలు పెండింగ్ లో పెట్టిన రేవంత్ రెడ్డికి శిక్ష వేయాలి....విద్యార్థులను అర్ధాకలితో ఉంచినందుకు ఏడాది విజయోత్సవాలు చేసుకుంటున్నావా? అని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి ప్రాధాన్యతలు వేరు. ఫోర్త్ సిటీ ,ఆరు లైన్ల రోడ్డు మీ భూముల దాకా వేసుకోవడం.ఇవి నీ ప్రాధాన్యతలు...కోట్ల రూపాయల డబ్బు ఉత్సవాల పేరుతో వృథా చేశారు అని దుయ్యబట్టారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి మంత్రులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు అంటే చిన్న చూపు...అటెండర్ అన్నం పెడుతున్నప్పుడు విద్యార్థులు అర్ధాలతో ఉన్నారు మెస్ బిల్లులు విడుదల చేయాలని గుర్తు చేయండన్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్నారు మూ అక్రమ కేసులు పెట్టి జైల్లో వేసే ప్రయత్నం చేస్తున్నారు.పెట్టాల్సింది అక్రమ కేసులు కాదు పేద విద్యార్థులకు అన్నం పెట్టు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యార్థులను అర్ధాకలితో ఉంచినందుకు ఏడాది విజయోత్సవాలు చేసుకుంటున్నావా?, ఆడపిల్లల హాస్టల్లలో చలికాలం వేడి నీళ్లు రాక ఇబ్బంది పడుతున్నారు అన్నారు. ఎస్సీ గురుకుల పాఠశాలల్లో అక్టోబర్, నవంబర్ మెస్ బిల్లులు పెండింగ్ ఉన్నాయి....పార్ట్ టైం ఉద్యోగులకు 8 నెలలుగా జీతాలు ప్రభుత్వం ఇవ్వడం లేదు అన్నారు. 8 నెలల నుండి జీతాలు చెల్లించకపోతే వారు ఎలా పని చేస్తారు? వాళ్ళ కుటుంబాన్ని ఎలా పోషిస్తారు.?, ఎస్సీ గురుకుల పాఠశాలల్లో ఆరు నెలలుగా కాస్మె టిక్ చార్జీలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఇదీ రేవంత్ రెడ్డి ఏడాది పాలన! కోతలు ఎక్కువ చేతలు తక్కువ అన్నారు.

బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి గారు సత్యవతి రాథోడ్ .. వికారాబాద్ జిల్లా తాండూరులో ఫుడ్ పాయిజన్ వల్ల బాలికలు ఆసుపత్రిలో పాలైతే వారిని పరామర్శించేందుకు వెళ్తుండగా ప్రభుత్వం అడ్డుకోవడం దుర్మార్గం అన్నారు. ప్రభుత్వం సక్రమంగా హాస్టళ్ళు నడుపుతున్న మాట నిజమైతే మాజీ మంత్రులు పోతుంటే ఎందుకు అడ్డుకున్నావు రేవంత్ రెడ్డి?,మీ తప్పులు, మీ లోపాలు బయటపడతాయని సబితని అడ్డుకున్నారు....అరెస్టులు కాదు చేయాల్సింది, పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టు అన్నారు.

సంవత్సర కాలం నుంచి హాస్టల్ భవనాలకు అద్దెలు చెల్లించడం లేదు. వెంటనే హాస్టల్ రెంట్లను చెల్లించాలని డిమాండ్ చేశారు హరీశ్‌ రావు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి పూర్తిగా విఫలమయ్యారు....ముఖ్యమంత్రి ఏనాడైనా ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ కు వెళ్లి విద్యార్థుతో భోజనం చేసావా?. ఒకనాడైనా విద్యార్థులను పరామర్శించావా? చెప్పాలన్నారు. అధికారంలోకి వచ్చాక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను విస్మరిస్తున్నాడు.... రేవంత్ రెడ్డి ప్రాధాన్యతలు వేరు. ఫోర్త్ సిటీ కడతా ఆరు లైన్ల రోడ్డు మీ భూముల దాకా వేసుకుంటా.. ఇవి నీ ప్రాధాన్యతలు అన్నారు.  ఆ జర్నలిస్టుకు క్షమాపణలు చెబుతున్నా.. అతను త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా.. మోహన్ బాబు లేఖ 

మీరు దొడ్డు బియ్యంతో అన్నం పెడుతుంటే ముద్దలాగ అయిన అన్నాన్ని విద్యార్థులు తినలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి మంత్రులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు అంటే చిన్న చూపు అన్నారు. తక్షణమే ప్రభుత్వం హాస్టల్ మెస్ బిల్లులన్నీ విడుదల చేయాలి...ఆరు నెలలుగా సిద్దిపేట ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కి బిల్లులు విడుదల చేయలేదు. ఆరు నెలలుగా బిల్లులు లేకుండా విద్యార్థులకు భోజనం ఏ విధంగా పెడతారు? చెప్పాలన్నారు.

ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు విద్యా సంవత్సరం ప్రారంభం నుండి ఇప్పటివరకు మిస్ చార్జీలు విడుదల చేయలేదు...రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతాయి చేతలు గడప కూడా దాటవు. రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉందేమోనన్నారు. గత సంవత్సరం విద్యార్థులకు ప్లేటు, గ్లాసు, స్పూన్ టవల్స్, స్కూల్ యూనిఫార్మ్స్ అన్ని సకాలంలో అందాయి....ఈ సంవత్సరం ఇవేవీ ఇవ్వలేదు అని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నారు. రేవంత్ రెడ్డి ..రాజీవ్ గాంధీ పుట్టిన రోజుకు ఫుల్ పేజీ పేపర్ యాడ్ ఇస్తున్నారు. తొమ్మిది రోజుల విజయోత్సవాలు జరుపుకున్నారు. కానీ ఈ పిల్లలకు బుక్కెడు అన్నం పెట్టే చాతకాదా? చెప్పాలని ప్రశ్నించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Indiramma Houses In Telangana: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ముహుర్తం ఖరారు, రేపు నారాయణపేట జిల్లా అప్పకపల్లెలో శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్‌

Bhupalapally Murder Case: భూవివాదం నేపథ్యంలోనే రాజలింగమూర్తి హత్య అన్న బీఆర్ఎస్..సీబీసీఐడీతో విచారిస్తామ్న మంత్రి కోమటిరెడ్డి, భూపాలపల్లి హత్య నేపథ్యంలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ మాటల యుద్ధం

Telangana Assembly Sessions: మార్చి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు..5 రోజుల పాటు జరిగే అవకాశం, బీసీ, ఎస్సీ రిజర్వేషన్లపై చట్టాలు చేయనున్న ప్రభుత్వం!

Who Is Rekha Gupta? ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తా ఎవరు? ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే సీఎం పదవి ఎలా వరించింది, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే పూర్తి బయోగ్రఫీ ఇదే..

Share Now