Justice For Disha: దిశ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్, ఏర్పాట్లు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం, వీలైనంత త్వరలో నిందితులకు శిక్ష ఖరారు

హైకోర్ట్ ఆమోదం నేపథ్యంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది. ఇది ఏర్పాటైన తర్వాత రోజూవారీ పద్ధతిలో ప్రత్యేకంగా ఈ కేసు విచారణను పూర్తి చేస్తారు, నిందితులకు శిక్షలు ఖరారు కాగానే తీర్పుకనుగుణంగా శిక్షలు అమలు చేయడం జరుగుతుంది....

High Court of Telangana|| Photo Credits: Wikimedia Commons

Hyderabad, December 4:  శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో అత్యాచారం, హత్యకు గురికాబడ్డ దిశ (Disha) కేసులో ఇక విచారణ వేగవంతం కానుంది. ఈ కేసుకు సంబంధించి బాధితురాలి కుటుంబానికి కొంత ఊరట కలిగించే ప్రయత్నంలో భాగంగా కేసు విచారణ వేగంగా పూర్తిచేసి నిందితులకు శిక్షలు ఖరారు చేసేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు (Fast-track court) ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది.  ఈ ప్రతిపాదనకు రాష్ట్ర హైకోర్ట్ (High Court) బుధవారం ఆమోదం తెలిపింది.

హైకోర్ట్ ఆమోదం నేపథ్యంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది. ఇది ఏర్పాటైన తర్వాత రోజూవారీ పద్ధతిలో ప్రత్యేకంగా ఈ కేసు విచారణను చేపట్టి, తక్కువ కాలంలో విచారణ పూర్తిచేస్తారు.  నిందితులకు శిక్షలు ఖరారు కాగానే తీర్పుకనుగుణంగా శిక్షలు అమలు చేయడం జరుగుతుంది.

దిశ హత్యాచారం ఘటన సందర్భంగా దేశవ్యాప్తంగా తీవ్రఆగ్రహావేశాలు వెలువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కేసును సత్వరమే విచారించి నిందితులకు కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని ఇటీవల సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

గతంలో వరంగల్ లో ఓ చిన్నారి ఘటన విషయంలో కూడా ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు కేసును సిఫారసు చేయడంతో 56 రోజుల్లోనే ఆ కేసు  విచారణ పూర్తయి తీర్పు వెలువడింది. ఈ క్రమంలో ఇప్పుడు దిశ కేసు ఎన్ని రోజుల్లో విచారణ పూర్తి చేస్తారో, ఎలాంటి శిక్షలు విధిస్తారనేదానిపై ఉత్కంఠత నెలకొంది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్‌ డోర్‌.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

Advertisement
Advertisement
Share Now
Advertisement