Munugode Bypoll: కొనసాగుతున్న మునుగోడు బైపోల్, పలిమెల ఘటనతో అలర్టయిన పోలీసు యంత్రాంగం, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు, గెలుపుపై ధీమాగా ఉన్న అధికార, ప్రతిపక్షాలు

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ (Munugode bypoll) కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ (polling) జరగనుంది. ఈ ఉప ఎన్నిక పోరులో అధికార టీఆర్ఎస్ పార్టీ (TRS), బీజేపీ(BJP), కాంగ్రెస్ (Congress), బీఎస్పీ (BSP), టీజేఎస్‌తో (TJS) పాటు మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

Credit @ ANI twitter

Munugode, NOV 03: మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ (Munugode bypoll) కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ (polling) జరగనుంది. ఈ ఉప ఎన్నిక పోరులో అధికార టీఆర్ఎస్ పార్టీ (TRS), బీజేపీ(BJP), కాంగ్రెస్ (Congress), బీఎస్పీ (BSP), టీజేఎస్‌తో (TJS) పాటు మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్ కోసం నియోజకవర్గం వ్యాప్తంగా 119 కేంద్రాల్లో 298 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద సీసీ కెమెరా ఏర్పాటుతో పాటు వెబ్ కాస్టింగ్ ను నిర్వహిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కేంద్ర, రాష్ట్ర బలగాలు కలిపి మొత్తం 5వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గోనున్నారు. 298 పోలింగ్ బూత్ లలో 49 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. పోలింగ్ కోసం మొత్తం 1192 ఈవీఎంలు, 596 వీవీ ప్యాట్లు, కంట్రోల్ యూనిట్లు వినియోగిస్తున్నారు. పోలింగ్ విధుల్లో 373 మంది పీవో, ఏపీవోలు పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2,41,805 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో.. చౌటుప్పల్ మున్సిపాలిటీలో 23,914, చండూరు మున్సిపాలిటీలో 10,768 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.

అదేవిధంగా మండలాల వారిగాచూస్తే.. చౌటప్పల్ మండలంలో 35,519 మంది ఓటర్లు, నారాయణపురం మండలంలో 36,430, మునుగోడులో 35,780, చండూరులో 22,741, మర్రిగూడలో 28,309 మంది ఓటర్లు, నాంపల్లి మండలంలో 33,819 మంది, గట్టుప్పల మండలంలో 14,525 మంది ఓటర్లు ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

Munugode Bypoll 2022: షాకింగ్ వీడియో, రూ. 10 వేలు, తులం బంగారం ఇస్తేనే ఓటు వేస్తాం, మునుగోడు ఉప ఎన్నికలో కొనసాగుతున్న ప్రలోభాల పర్వం 

అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు నువ్వానేనా అన్నట్లుగా ప్రచారాన్ని కొనసాగించారు. ముఖ్యంగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. పలు గ్రామాల్లో ఘర్షణలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రతీ గ్రామంలో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

CM Revanth Reddy: మహిళలకే మొదటి ప్రాధాన్యం..600 ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశామన్న సీఎం రేవంత్ రెడ్డి, స్వయం సహాయక సంఘాలకు ఏడాదికి రెండు చీరలు కానుకగా ఇస్తామని వెల్లడి

Meta Removes Raja Singh Accounts: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షాకిచ్చిన మెటా.. ఫేస్‌బుక్ - ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ బ్లాక్, రాహుల్‌ గాంధీపై మండిపడ్డ బీజేపీ ఎమ్మెల్యే

Indiramma Houses In Telangana: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ముహుర్తం ఖరారు, రేపు నారాయణపేట జిల్లా అప్పకపల్లెలో శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్‌

Bhupalapally Murder Case: భూవివాదం నేపథ్యంలోనే రాజలింగమూర్తి హత్య అన్న బీఆర్ఎస్..సీబీసీఐడీతో విచారిస్తామ్న మంత్రి కోమటిరెడ్డి, భూపాలపల్లి హత్య నేపథ్యంలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ మాటల యుద్ధం

Share Now