Telangana: ఆర్టీసీ బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు, ప్రాణం పోతుందని తెలిసి కూడా 50 మంది ప్రయాణికులను రక్షించాడు, ఖమ్మంలో విషాదకర ఘటన

ఖమ్మం(Khammam) జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటన వివరాల్లోకి వెళితే.. సత్తుపల్లి నుంచి ప్రయాణికులతో ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ శ్రీనివాస రావుకు ఉన్నట్టుండి హార్ట్‌ ఎటాక్ వచ్చింది.

Heart Attack. (Photo Credits: Pixabay)

Bus driver dies of heart attack while driving: ఖమ్మం(Khammam) జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటన వివరాల్లోకి వెళితే.. సత్తుపల్లి నుంచి ప్రయాణికులతో ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ శ్రీనివాస రావుకు ఉన్నట్టుండి హార్ట్‌ ఎటాక్ వచ్చింది.

అప్పటికే రన్నింగ్‌లో ఉన్న బస్సును కల్లూర్ పాత బస్టాండ్ సమీపంలో నిలిపి ప్రయాణికుల సాయంతో సమీప కల్లూర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. ఈ క్రమంలో డ్రైవర్ శ్రీనివాస్ రావును వైద్యుడు పరీక్షిస్తుండగానే మృతి చెందాడు. గుండెపోటుతో ఆయన కన్నుమూసినట్లు వైద్యులు ధృవీకరించారు.

స్కూల్లో డ్యాన్స్ వేస్తూ గుండెపోటుతో ఇంటర్ విద్యార్థిని మృతి, ఈ విషాదకర ఘటనపై డాక్టర్లు ఏమన్నారంటే..

తనకు గుండెపోటు వస్తున్న విషయాన్ని గమనించి బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను కాపాడారు డ్రైవర్ శ్రీనివాస రావు.డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించి బస్సును పక్కకు ఆపడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. బస్సులోని 50 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మృతుడు శ్రీనివాస రావు వేంసూరు మండలం, రామన్నపాలెం గ్రామానికి చెందిన వాడు, అతనికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

HC on Vijay Mallya’s Plea: విజయ్ మాల్యా రుణ ఎగవేత కేసులో కీలక మలుపు, బ్యాంకులకు నోటీసులు జారీ చేసిన కర్ణాటక హైకోర్టు, చేసిన అప్పు కంటే ఎక్కువ మొత్తం రికవరీ చేశారని మాల్యా పిటిషన్

Andhra Pradesh: ఏలూరులో దారుణం, ఎమ్మారై స్కానింగ్ చేస్తుండగా రేడియేషన్ తట్టుకోలేక మహిళ మృతి, సుష్మితా డయాగ్నస్టిక్‌ సెంటర్‌ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని భర్త ఆందోళన

PM Modi Speech in Lok Sabha: పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని జయించారు, లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చ సందర్భంగా ప్రధాని మోదీ

US Begins Deportation of Indian Migrants: అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కారు కొరడా, భారతీయులను వెనక్కి పంపుతున్న అగ్రరాజ్యం, దాదాపు 18 వేల మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్లుగా వార్తలు

Share Now