Revanth Reddy On Cyber Crimes: పోలీసు ఉద్యోగం జీవనోపాధి కోసం చేసే ఉద్యోగం కాదు.. ఇదొక భావోద్వేగం, కానిస్టేబుల్ కిష్టయ్య త్యాగాలను మరిచిపోలేదన్న సీఎం రేవంత్ రెడ్డి

కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి ఎంతో మంది త్యాగాలను తెలంగాణ ప్రజలు మరిచిపోలేదు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పోలీసు ఉద్యోగం జీవనోపాధి కోసం చేసే ఉద్యోగం కాదు. ఇదొక భావోద్వేగం అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్ట మొదటిసారి నిర్వహించిన పోలీస్ డ్యూటీమీట్ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Telangana CM Revanth says World is facing biggest threat of cybercrimes(CMO X).jpg

Hyd, Oct 20:  కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి ఎంతో మంది త్యాగాలను తెలంగాణ ప్రజలు మరిచిపోలేదు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పోలీసు ఉద్యోగం జీవనోపాధి కోసం చేసే ఉద్యోగం కాదు. ఇదొక భావోద్వేగం అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్ట మొదటిసారి నిర్వహించిన పోలీస్ డ్యూటీమీట్ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

రాజాబహదూర్ వెంకటరామారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన ఈ వేడుకలో పోలీసులకు దిశానిర్దేశం చేశారు. పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడంలో అనుసరించాల్సిన విధి విధానాలపై రూపొందించిన పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

పోలీసు శాఖకు సంబంధించి వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ట్రోఫీలు అందజేశారు. మొదటి బహుమతి పొందిన టీమ్‌కు రూ. 5 లక్షలు, రెండో బహుమతికి రూ3 లక్షలు, మూడో బహుమతిగా రూ. 1.5 లక్షల నగదు అవార్డును ప్రకటించారు.

క్షేత్రస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు తెలంగాణ పోలీసు శాఖకు స్పూర్తినిచ్చే విధంగా డ్యూటీ మీట్ కార్యక్రమం నిర్వహించినందుకు ఈ సందర్భంగా ఆ శాఖను అభినందించారు.

నేషనల్ పోలీస్ డ్యూటీ మీట్‌లో కూడా తెలంగాణ పోలీసులు రాణించాలని ఆకాంక్షించారు. అందుకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని చెప్పారు. దేశంలోనే మిగతా పోలీసులకు ఆదర్శంగా నిలువాలని కోరారు.సైబర్ క్రైమ్స్, మాదక ద్రవ్యాల రవాణా వంటి కొత్త పుంతలు తొక్కుతున్న నేరాలను అరికట్టడానికి పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు.  కేంద్రమంత్రి బండి సంజయ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్, తిరస్కరించిన బండి, గ్రూప్ 1 అభ్యర్థులతో కలిసి దీక్ష

పోలీసు కుటుంబాల కష్టం, నష్టాన్ని గమనించే అంతర్జాతీయ స్థాయిలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభిస్తున్నాం అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నందునే హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగిందన్నారు. రాష్ట్రంలోకి గంజాయి లాంటి మత్తుపదార్థాలు సరిహద్దు జిల్లాల పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2013 లో కాకినాడలో జరిగిన పోలీస్ డ్యూటీ మీట్ తర్వాత తెలంగాణలో తొలిసారి డ్యూటీ మీట్ నిర్వహణకు అంగీకరించడంపై డీజీపీతో పాటు పోలీసు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

SC On BRS MLAs' Case: రోగి చనిపోతే ఆపరేషన్ విజయవంతమా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ

Newlywed Dies by Suicide: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అయినా అదనపు కట్నం వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య, హైదరాబాద్‌లో విషాదకర ఘటన

Karnataka:పెళ్లిని దాచిపెట్టి లైంగిక అవసరాలు తీర్చుకుని వదిలేసిందంటూ ఉద్యోగి ఆత్మహత్య, ప్రేమలో పడి మోసపోకండి అంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసిన బాధితుడు

Telangana Inter Exams: విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డు గుడ్ న్యూస్.. నిమిషం నిబంధన ఎత్తివేత.. పేపర్ లీకైతే ఏ విద్యార్థి ద్వారా లీకైందో తెలుసుకునేలా సీరియల్ నంబర్

Advertisement
Advertisement
Share Now
Advertisement