Judicial Commission Sent Notice to KCR: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవకతవకలు, కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసిన జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి కమిషన్

2014 నుంచి 2023 వరకు సీఎంగా ఉన్న సమయంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో (పీపీఏ) అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు జారీ చేసింది.

Telangana Ex-CM KCR Served Notice in Judicial Inquiry, related to Power purchase agreements with Chattisgarh Govt, Yadadri & Bhadradri power projects during BRS regime

KCR sent notice by judicial commission:  2014 నుంచి 2023 వరకు సీఎంగా ఉన్న సమయంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో (పీపీఏ) అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు జారీ చేసింది.

జూన్ 15లోగా భారత రాష్ట్ర సమితి (BRS) వ్యవస్థాపకుడు, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు అయిన కేసీఆర్ నుండి కమిషన్ సమాధానం కోరింది. ఈ అంశంలో కేసీఆర్‌, సురేశ్‌ చందా, అజయ్‌ మిశ్రా సహా 25 మందికి నోటీసులు ఇచ్చినట్లు జస్టిస్‌ నరసింహారెడ్డి పేర్కొన్నారు. వివరణ ఇచ్చేందుకు కేసీఆర్‌ జులై 30 వరకు సమయం అడిగారని చెప్పారు. జూన్‌ 15 లోపు వివరణ ఇవ్వాలని కేసీఆర్‌కు తెలిపినట్లు వెల్లడించారు.  తెలుగు రాష్ట్రాల‌ కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన, విభజన చట్టంలోని అంశాల అమలు కోసం కృషి చేయాలని పిలుపు

యాదాద్రి, భద్రాద్రిలో పవర్ ప్రాజెక్టులు నిర్మించేందుకు ఛత్తీస్‌గఢ్‌ నుంచి అసాధారణంగా అధిక ధరలకు విద్యుత్‌ను నాటి కేసీఆర్ ప్రభుత్వం కొనుగోలు చేసిందన్న ఆరోపణలపై విచారణకు రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మార్చిలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను నియమించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ కొరత కారణంగా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో విద్యుత్ కొనుగోలుకు ఒప్పందాలు జరిగాయి.

Here's Video

చంద్రశేఖర్ రావు హయాంలో కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణకు అదే నెలలో ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం మరో కమిషన్‌ను నియమించింది. తెలంగాణ జెన్‌కో మాజీ సీఎండీ ప్రభాకర్‌రావు, మాజీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ (ఇంధనం) సురేశ్‌ చంద్‌ కమిషన్‌ ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Health Tips: శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు కనిపించే సంకేతాలు ఇవే...వీటిని జాగ్రత్తగా గమనించకపోతే గుండె పోటు తప్పదు..

Astrology: ఫిబ్రవరి 26 నుంచి ఈ 4 రాశుల వారికి కేమాధ్రుమ యోగం ప్రారంభం..లక్ష్మీ దేవి దయతో వీరు ధనవంతులు అవుతారు..ఆకస్మిక ధనలాభం కలుగుతుంది...ఆస్తులు అమాంతం పెరుగుతాయి..

Astrology: ఫిబ్రవరి 26 మహాశివరాత్రి నుంచి ఈ 3 రాశుల వారికి 60 సంవత్సరాల తర్వాత అదృష్ట యోగం ప్రారంభం...వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది..ధన కుబేరులు అవడం ఖాయం..

Astrology: ఫిబ్రవరి 28 నుంచి ఈ 4 రాశుల వారికి విపరీత రాజయోగం ప్రారంభం...ధన లక్ష్మీదేవి వీరిపై కృప చూపించడం ఖాయం..అదృష్టం కలిసి వస్తుంది..కోటీశ్వరులు అవడం ఖాయం..

Share Now