Telangana: త్వరలో రూ.2 లక్షల రుణమాఫీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన, అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా ప్రకటన చేస్తామని వెల్లడి

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తుందని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధర్మబద్ధంగా ప్రతి పైసాను ఖర్చుపెట్టాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు.

Mallu Bhatti Vikramarka (Photo-X)

Hyd, July 3: ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తుందని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధర్మబద్ధంగా ప్రతి పైసాను ఖర్చుపెట్టాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు. రైతు భరోసాపై విధి విధానాలు రూపొందిస్తున్నాం.. అందరి అభిప్రాయాలు తీసుకుంటాం. సంపద సృష్టిస్తాం.. ప్రజలకు పంచుతాం’’ అని భట్టి అన్నారు.

రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ఐదేళ్లు కాలయాపన చేసిన బీఆర్ఎస్ నేతలు మమ్మల్ని రుణమాఫీ ఎప్పుడు చేస్తారని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. రుణమాఫీపై బీఆర్‌ఎస్‌ డ్రామాలాడుతోందని భట్టి విక్రమార్క మండిపడ్డారు. త్వరలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం. అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా ప్రకటన చేస్తామని భట్టి తెలిపారు.  బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు, గాజులు వేసుకుని వెళ్లారు, మీదో బతుకా? అంటూ మండిపడిన ఎమ్మెల్యే

ఏడు మండలాల కోసం బీఆర్ఎస్ దీక్ష చేయాలి. ఏడు మండలాలు పోవడానికి కారణం బీఆర్ఎస్, బీజేపీనే. పదేండ్ల పెండింగ్ సమస్యలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చిస్తారు. విభజన చట్టంలో ఏడు మండలాల ప్రస్తావన లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆర్డినెన్స్‌తో ఏడు మండలాలను ఏపీలో కలిపారు. ఏడు మండలాల కోసం పోరాటం చేస్తానని అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్ ఏమయ్యాడని భట్టి ప్రశ్నించారు.

క్యాబినెట్ విస్తరణ పూర్తిగా అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుంది. పీసీసీ నూతన చీఫ్ విషయంలో కసరత్తు కొనసాగుతుంది. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. పదిహేనేండ్లు మేమే అధికారంలో ఉంటామని చెపుతున్న కేసీఆర్‌వి కల్లిబొల్లు కబుర్లే. రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం.. పుట్టింది బతకడానికి.. చావడానికి కాదు. ఆత్మహత్య వెనుక ఎవరున్నారనే దర్యాప్తు కొనసాగుతోంది. ఆత్మహత్య వెనక ఎవరున్నా విడిచిపెట్టేది లేదు’’ అని భట్టి విక్రమార్క అన్నారు.

రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్‌ సబ్‌ కమిటీలో మా సొంత నిర్ణయాలు ఉండవు. అన్ని జిల్లాల్లో ప్రజలందరితో చర్చించిన తర్వాత ఓ నివేదిక తయారు చేస్తాం. దానిపై అసెంబ్లీలో చర్చ పెట్టిన తర్వాత విధివిధానాల ఖరారు ఉంటుంది. సంపద సృష్టించి ప్రజలకు పంచాలన్నదే మా ఆలోచన. రైతులు, పన్ను చెల్లింపుదారులు, మీడియా మిత్రులతో మాట్లాడి దీనిపై నిర్ణయం తీసుకుంటాం’’ అని భట్టి తెలిపారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement