Sangareddy Horror: అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. ముగ్గురి అరెస్ట్.. సంగారెడ్డిలో ఘటన

అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల బాలికపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. సంగారెడ్డి జిల్లాలోని ఫసల్ వాదీ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో గురువారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది.

gang rape cctv (Credits: X)

Sangareddy, Feb 21: అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల  బాలికపై (Girl) ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి (Gang Rape) ఒడిగట్టారు. సంగారెడ్డి (Sangareddy) జిల్లాలోని ఫసల్ వాదీ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో గురువారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఫసల్ వాదీ డబుల్ బెడ్ రూమ్ కాలనీ సమీపంలోని డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల సముదాయంలో ఇంటి బయట ఆడుకుంటున్న బాధిత బాలికను అదే కాలనీలో నివాసముండే ముగ్గురు యువకులు చాక్లెట్ ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి చెట్ల పొదల్లోకి తీసుకెళ్ళారు. అప్పటికే వాళ్లంతా మద్యం మత్తులో ఉన్నారు.

స్కూలుకు వెళుతూ మార్గమధ్యంలో గుండెపోటుతో మరణించిన పదో తరగతి విద్యార్థిని.. కామారెడ్డిలో ఘటన

తెలిసిన అన్నలే కావడంతో..

తెలిసిన అన్నలే కావడంతో చాక్లెట్ల ఆశకు బాలిక వారితో పాటు వెళ్లింది. ఇదే సమయంలో ఆ మృగాళ్లు పసిపాప అని కూడా చూడకుండా అత్యాచారానికి పాల్పడ్డారు. చిన్నారికి తీవ్ర రక్తస్రావమై అరవడంతో సమీపంలోని స్థానికులు వెంటనే వచ్చారు. నిందితుల్లో ఒకరిని పట్టుకుని చితకబాదారు. నిందితులు మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసింది. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సంగారెడ్డి పోలీసులు వెల్లడించారు. బాలికను తీసుకుపోతున్న ఘటనలు  సీసీటీవీలో రికార్డయ్యాయి.

బ్యాడ్మింటన్ డబుల్స్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్ కు పితృవియోగం.. గుండెపోటుతో తండ్రి హఠాన్మరణం.. అవార్డు అందుకోవడానికి వెళ్తుండగా ఊహించని ఉపద్రవం.. అసలేం జరిగింది?

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement