
Kamareddy, Feb 21: గతంలో గుండెపోటు (Heart Attack) అంటే 60-70 ఏండ్లు దాటిన వారికి అదీ ఊబకాయంతో బాధపడే వారికి వచ్చేది. అయితే, ఇప్పుడు యువతీయువకులతో పాటు స్కూల్ పిల్లలకు కూడా గుండెపోటు రావడంతో పాటు కొన్ని మరణాలు కూడా సంభవించడం నిత్యకృత్యంగా మారింది. కామారెడ్డి (Kamareddy) జిల్లా కేంద్రంలో ఇలాంటి విషాదకర ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న బాలిక కాలి నడకన పాఠశాలకు వెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలో గుండెపోటుతో మరణించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రామారెడ్డి మండలం సింగరాయిపల్లికి చెందిన శ్రీనిధి (14) కామారెడ్డిలోని కల్కినగర్ లో తన పెదనాన్న ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.
కామారెడ్డిలో గుండెపోటుతో చనిపోయిన టెన్త్ క్లాస్ విద్యార్దిని
స్కూల్ కు వెళ్తుండగా గుండెపోటు రావడంతో కళ్లు తిరిగి పడిపోయిన శ్రీనిధి
ఆస్పత్రిలో చేర్పించిన కుటుంబ సభ్యులు..అప్పటికే చనిపోయిందన్న వైద్యులు
శ్రీనిధి మృతితో స్వగ్రామం సింగరాయపల్లిలో విషాదం pic.twitter.com/juHZ0EZfUY
— Lokal App- Telugu (@LokalAppTelugu) February 20, 2025
నడుస్తూ వెళ్తుండగా..
గురువారం ఉదయం టిఫిన్ తినకుండా బాక్సు కట్టుకొని పాఠశాలకు బయలుదేరింది శ్రీనిధి. నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలో స్కూలు సమీపంలో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే స్పందించిన పాఠశాల యాజమాన్యం బాలికను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోవడంతో మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగానే శ్రీనిధి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో శ్రీనిధి కుటుంబంలో విషాదం నెలకొంది.