Syria President Flees: సిరియాలో అంతర్యుద్ధం.. రాజధాని డమాస్కస్‌ లోకి ప్రవేశించిన తిరుగుబాటు దళాలు.. దేశం విడిచి పారిపోయిన అధ్యక్షుడు బషర్

సిరియాలో అంతర్యుద్ధం తారాస్థాయికి చేరింది. రష్యా, ఇరాన్ దేశాల మద్దతు ఉన్న అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్‌ ను గద్దె దించడమే లక్ష్యంగా తిరుగుబాటు గ్రూపులు, మిలిటెంట్ల బృందాలు రాజధాని డమాస్కస్‌ నగరంలోకి ప్రవేశించాయి.

Bashar Al-Assad (Credits: X)

Newdelhi, Dec 8: సిరియాలో (Syria) అంతర్యుద్ధం తారాస్థాయికి చేరింది. రష్యా, ఇరాన్ దేశాల మద్దతు ఉన్న అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్‌ ను గద్దె దించడమే లక్ష్యంగా తిరుగుబాటు గ్రూపులు, మిలిటెంట్ల బృందాలు రాజధాని డమాస్కస్‌ నగరంలోకి ప్రవేశించాయి. దీంతో బషర్ అల్ అస్సాద్ (Bashar Al-Assad) దేశం విడిచి పారిపోయారు. తిరుగుబాటుదారులు నగరంలోకి  ప్రవేశించడానికి ముందే ఆయన గుర్తు తెలియని ప్రాంతానికి వెళ్లిపోయినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.  కాగా, తిరుగుబాటు దళాలకు శాంతియుతంగా అధికార మార్పిడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని సిరియా ప్రధాని మహమ్మద్ ఘాజీ జలాలి ప్రకటించారు. ఈ మేరకు ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు.

ఎన్ని కష్టాలైనా మూసీని ప్రక్షాళన చేసి తీరుతాం...సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు..స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

50 ఏండ్ల పాలనకు ముగింపు

బషర్ అల్ అస్సాద్ దేశం విడిచి పారిపోవడంతో సిరియాలో గడిచిన 50 ఏళ్లుగా సాగుతున్న అతడి కుటుంబ పాలనకు ముగింపు పడినట్లయింది. గత 24 ఏళ్లుగా సిరియాలో అసద్ పాలన సాగిస్తున్న విషయం తెలిసిందే. అంతకుముందు 26 ఏండ్లు ఆయన తండ్రి పాలన సాగించారు.

తెలంగాణ కోసం మంత్రి పదవిని వదులుకున్న కోమటిరెడ్డి..నల్గొండ గాలి పీల్చుకుంటేనే సాయుధ పోరాటం గుర్తుకొస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ పాలనలో అభివృద్ధి శూన్యం అని మండిపాటు

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement