Ukrainian President Volodymyr Zelenskyy (Photo Credits: Instagram)

Kyiv, March 24: రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర పోరు (Russia-Ukraine War) నడుస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ సంచలన పిలుపునిచ్చారు. రష్యా దండయాత్రకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ (Ukrainian President Volodymyr Zelenskyy) ప్రపంచ ప్రజలను కోరారు.రష్యా తన దండయాత్రను ఆపడానికి అంతర్జాతీయ ఒత్తిడిని పెంచే ప్రయత్నంలో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల పౌరులను వారి దేశాల్లో నిరసనలు ప్రారంభించాలని పిలుపునిచ్చారు.

మార్చి 24వతేదీ నుంచి ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడానికి తమ దేశ చిహ్నాలతో వీధుల్లోకి రండి, మీ వాణిని వినిపించండని జెలెన్స్కీ వీడియోలో కోరారు.మనమందరం రష్యాను ఆపాలి. ప్రపంచం యుద్ధాన్ని ఆపాలి. ఉక్రెయిన్‌కు మద్దతుగా వ్యవహరించిన ప్రతి ఒక్కరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శాంతియుతంగా ఉండేవారిపై ఉగ్రదాడులు కొనసాగుతున్నాయి’’ అని ఆయన అన్నారు.‘‘ యుద్ధం మొదలై ఇప్పటికే నెల రోజులైంది.ఇది నా హృదయాన్ని, ఉక్రేనియన్లందరి హృదయాలను విచ్ఛిన్నం చేస్తోంది. అందుకే యుద్ధానికి వ్యతిరేకంగా నిలబడమని ( Global Protests as Russian Invasion Completes One Month) నేను మిమ్మల్ని అడుగుతున్నానని జెలెన్స్కీ విజ్ఞప్తి చేశారు.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం 29వ రోజుకు చేరుకోగా రెండు దేశాలు మరో రౌండ్ చర్చలకు సిద్ధమవుతున్నాయి.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని నోబెల్ బహుమతికి నామినేట్ చేసిన యూరోపియన్ దేశాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం

నిన్న దేశ రాజధాని కీవ్‌లో రష్యన్‌ బలగాలు గుండ్ల వర్షం కురింపించడంతో రష్యాకు చెందిన మహిళా జర్నలిస్టు మృతిచెందింది. పరిశోధనాత్మక వార్తా సంస్థ ది ఇన్‌సైడర్‌కు (The Insider) చెందిన జర్నలిస్టు ఓక్సానా బౌలినా (Oksana Baulina) మరణించిందని ఆ సంస్థ ప్రకటించింది. కీవ్‌లో రష్యా దళాలు సృష్టించిన విధ్వంసాన్ని చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తు మృతిచెందిందని తన వెబ్‌సైట్‌లో పేర్కొన్నది. ఈ దాడిలో మరో పౌరుడు కూడా మరణించాడని, ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని చెప్పింది. బౌలినా గతంలో రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవల్నీ అవినీతి నిరోధక బృందంలో పనిచేశారు. కాగా, ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో బౌలినా క్షేత్రస్థాయిలో ఇన్‌సైడర్‌ కోసం పనిచేస్తున్నారు. విధుల్లో భాగంగా పశ్చిమ ఉక్రెయిన్‌లోని కీవ్, ఎల్వివ్‌ నుంచి అనేక వార్తా కథనాలను ఆమె అందించారు.

క్రెయిన్‌కు ఆయుధాలతోపాటు ఆర్థికంగా మరింత సాయం అందిస్తామని బ్రిటన్‌ ప్రకటించింది. ఉక్రెయిన్‌ ఆర్మీకి 6 వేల మిస్సైళ్లు, 25 మిలియన్‌ పౌండ్ల ఆర్థిక సహాయం చేస్తామని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ (Boris Johnson) చెప్పారు. ఇందులో మిలిటరీ హార్డ్‌వేర్‌, యాంటీ ట్యాంక్‌, అత్యధిక పేలుడు సామర్థ్యం కలిగిన ఆయుధాలు ఉంటాయని తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిపై చర్చించడానికి నాటో, జీ7 దేశాలు సమావేశమవుతున్న నేపథ్యంలో బోరిస్‌ జాన్సన్‌ ఈ మేరకు ప్రకటించారు. కాగా, బ్రిటన్‌ ఇప్పటికే 4 వేల యాంటీ ట్యాంక్‌ మిస్సైల్స్‌, జావెలిన్‌ క్షిపనులను ఉక్రెయిన్‌ సైన్యానికి అందించింది. అదేవిధంగా మానవాద దృక్పదంతో 400 మిలియన్‌ ఫౌండ్ల ఆర్థిక సహాయం అందిస్తామని గతంలో ప్రకటించింది.



సంబంధిత వార్తలు

AARAA Exit Poll: పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారంటున్న ఆరా మస్తాన్ సర్వే, లోకేష్ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారని వెల్లడి

Andhra Pradesh Assembly Exit Poll: ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ పూర్తి వివరాలు ఇవిగో, అధికార వైసీపీకే మొగ్గు చూపిన మెజార్టీ సర్వేలు

Telangana Exit Poll: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాకిచ్చిన ఎగ్జిట్ పోల్స్, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే టఫ్ పైట్, బీజేపీ అత్యధిక లోక్ సభ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందంటున్న సర్వేలు

Lok Sabha Exit Poll: అధికార బీజేపీ కూటమికే పట్టం కట్టిన మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్ల మధ్య వస్తాయంటే..

Andhra Pradesh Lok Sabha Exit Poll: ఏపీలో లోక్ సభ స్థానాల ఎగ్జిట్ పోల్స్ పూర్తి వివరాలు ఇవిగో, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే..

Operation Chanakya Exit Poll: అధికార వైసీపీకే జైకొట్టిన ఆపరేషన్ చాణక్య సర్వే, 95 నుంచి 102 సీట్లతో జగన్ మళ్లీ అధికారంలోకి, 64 నుంచి 68 సీట్ల మధ్యలో టీడీపీ

Chanakya Strategies Exit Poll: 114 నుంచి 125 సీట్లతో టీడీపీ అధికారంలోకి, 39 నుంచి 49 సీట్ల మధ్యలో వైసీపీ, Chanakya strategies Exit Poll ఇదిగో..

Avian Influenza Alert: ఏపీతో సహా నాలుగు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ డేంజర్ బెల్స్, అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక, మానవులకూ సోకే ఆస్కారం ఉందని వెల్లడి