Bandaru Dattatreya: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్ కి ప్రమాదం.. హైదరాబాద్ లో ఘటన
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్ కు ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లడానికి శంషాబాద్ విమానాశ్రయానికి దత్తాత్రేయ వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Newdelhi, Oct 21: హర్యానా (Haryana) గవర్నర్ బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya) కాన్వాయ్ కు ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లడానికి శంషాబాద్ విమానాశ్రయానికి దత్తాత్రేయ వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కిషన్ గూడ ట్రంపెట్ బ్రిడ్జి సమీపంలోకి వచ్చిన సమయంలో మార్గమధ్యంలో హఠాత్తుగా ఓ కారు కాన్వాయ్ మధ్యలోకి వచ్చింది. దీంతో కాన్వాయ్ లోని వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో అదుపుతప్పి కాన్వాయ్ లోని మూడు కార్లు ఢీకొన్నాయి.
దత్తన్న సేఫ్
ఈ ప్రమాద ఘటనలో సెక్యూరిటీ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. దత్తాత్రేయకు ఏమీ కాలేదు. వెంటనే అప్రమత్తమైన మిగతా సిబ్బంది దత్తాత్రేయ కారు సురక్షితంగా ముందుకు పోయేలా చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Advertisement
సంబంధిత వార్తలు
Raichur Road Accident: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మంత్రాలయ విద్యార్థులు మృతి, సంతాపం తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్, అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ
Kambhampati Hari Babu: ఒడిశా గవర్నర్గా కంభంపాటి హరిబాబు, మిజోరం గవర్నర్గా వీకే సింగ్...5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన కేంద్రం
Shaktikanta Das Retirement: ఆర్బీఐకి అత్యుతమ సేవలు అందించానని భావిస్తున్నా, పదవీవిరమణ తర్వాత మీడియాతో మాట్లాడిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్
Eknath Shinde Resign: మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా, గవర్నర్కు రాజీనామా సమర్పించిన షిండే...సీఎం ఎవరన్నది ఇంకా సస్పెన్సే!
Advertisement
Advertisement
Advertisement