Terror Attack in JK: జమ్ముకశ్మీర్‌ లో ఉగ్రవాదుల ఘాతుకం.. సొరంగ నిర్మాణ కార్మికుల క్యాంప్‌ పై కాల్పులు.. ముష్కరుల దాడిలో ఒక డాక్టర్, ఆరుగురు కార్మికుల మృత్యువాత

జమ్ముకశ్మీర్‌ లో ఉగ్రవాదులు ఘాతుకానికి తెగబడ్డారు. గందర్‌ బాల్‌ జిల్లా గుండ్ ప్రాంతంలోని ఓ నిర్మాణ సైట్‌ క్యాంప్ లో ఉన్న కార్మికులపై కాల్పులు జరిపారు.

Terror Attack in JK: జమ్ముకశ్మీర్‌ లో ఉగ్రవాదుల ఘాతుకం.. సొరంగ నిర్మాణ కార్మికుల క్యాంప్‌ పై కాల్పులు.. ముష్కరుల దాడిలో ఒక డాక్టర్, ఆరుగురు కార్మికుల మృత్యువాత
Terror Attack in JK (Credits: X)

Newdelhi, Oct 21: జమ్ముకశ్మీర్‌ (Jammu Kashmir) లో ఉగ్రవాదులు (Terrorists) ఘాతుకానికి తెగబడ్డారు. గందర్‌ బాల్‌ జిల్లా గుండ్ ప్రాంతంలోని ఓ నిర్మాణ సైట్‌ క్యాంప్ లో ఉన్న కార్మికులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక డాక్టర్‌తో పాటు ఆరుగురు కార్మికులు చనిపోయారు. మరో ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని సమీపంలోని దవాఖానకు తరలించి చికిత్స అందించారు. బాధిత కార్మికులు అందరూ స్థానికేతరులేనని, అందరూ ఒక ప్రైవేటు నిర్మాణ కంపెనీకి చెందినవారేనని పోలీసులు తెలిపారు. ఈ చర్యకు పాల్పడడానికి గల కారణాలను తెలుసుకునేందుకు అన్వేషిస్తున్నట్టు వెల్లడించారు.

గోల్డ్ మాయం చేసిన మేనేజర్, వికారాబాద్ మణప్పురం బ్రాంచ్‌లో బంగారం ఎత్తుకెళ్లిన మేనేజర్, బాధితుల ఆందోళన...వీడియో

Here's Video:

ఈ దాడి ఓ పాపపు చర్య

ఉగ్ర దాడిని జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు. అమాయక కార్మికులపై జరిపిన దాడి ఒక పాపమని, పిరికిపంద చర్య అని ఆయన అభివర్ణించారు. ఈ ఉగ్రదాడిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మరో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఖండించారు.

యాప్ మోసం, రూ.లక్షాన్నర వరకు మోసం..యాప్ లాక్ అవడంతో లబోదిబోమంటున్న బాధితులు...వీడియో ఇదిగో 

(The above story first appeared on LatestLY on Oct 21, 2024 08:23 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).